Mahesh babu : ఎట్టకేలకు మొదలైన గుంటూరు కారం!షూటింగ్ కి పూజా హెగ్డే దూరం..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు సినిమాలు ఈ మధ్య వివాదాస్పదంగా మారుతున్నాయి. రోజుకో రూమర్, పూటకో గాసిప్ తో గుంటూరు కారం సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే , మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అంతేకాదు టాలీవుడ్ లో మహేష్ బాబు స్టార్డం ని కూడా పెంచాయి. దాంతో వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సహం మొదలైంది. అందరి అంచనాలను మ్యాచ్ చేసేలా ఇటీవలనే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

అయితే గుంటూరు కారం సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి త్రివిక్రమ్, ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా పనుల్లో అంతరాయం కలిగింది. సినిమా షూటింగ్ మొదలైన కొత్తలో షూటింగ్ అంత సవ్యంగానే సాగిన, ఇటీవలనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడంటూ, పూజా హెగ్డే ని కూడా తీసేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ , థమన్ సినిమాలో కొనసాగుతున్నాడు అని ట్వీట్ చేయడంతో, వ్యవహారం సద్దుమణిగింది. అయితే పూజా హెగ్డే మాత్రం సినిమా నుంచి తప్పుకుందని సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు నుంచే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఎన్ని అడ్డంకులు వచ్చిన సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని మూవీ యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు