Adipurush: అన్ని రకాలుగానూ డిజాస్టర్.. కానీ ఆ సినిమాని దాటేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” జూన్ 16న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా పలు వివాదాలకు కారణమయ్యింది.

ఈ సినిమాను రామాయణం ఆధారంగా తీసినప్పటికి కథను చాలా వక్రీకరించి తీసారని డైరెక్టర్ ని ఇంకా సినిమా టీం ని ప్రేక్షకులు చాలా విమర్శిస్తున్నారు. ఇక సినీ విమర్శకులైతే దర్శక నిర్మాతలని ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. నార్త్ లో ఇప్పటికే చాలా చోట్ల బ్యాన్ అయిన ఈ సినిమా సౌత్ లో మాత్రం అక్కడక్కడా నడుస్తుంది. అయితే చాలా ఏళ్ళ తరువాత రామాయణ కాన్సెప్ట్ తో రావడం వల్ల ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మూడు రోజుల్లోనే 300కోట్లు రాబట్టిన ఈ సినిమా తర్వాత మాత్రం డల్ అయ్యింది.

తాజాగా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ సినిమా కలెక్షన్లను దాటేసింది. అదే అల్లు అర్జున్ ని పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ చేసిన “పుష్ప” ది రైజ్ సినిమా. ఈ సినిమా 2021 డిసెంబర్ లో విడుదలై మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా హిందీలో పుష్ప వంద కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 360 కోట్ల గ్రాస్ ని వసూలు చేయగా ఇప్పుడా రికార్డు ని ఆదిపురుష్ బ్రేక్ చేసింది. 8రోజుల్లో ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా 362 కోట్లు వసూలు చేసి పుష్ప ని క్రాస్ చేసింది. అయితే చాలా చోట్ల ఈ సినిమాకి కలెక్షన్స్ పడిపోగా కలెక్షన్స్ ఎండ్ అయ్యే సరికి ఆదిపురుష్ మహా అయితే మరో 10కోట్లు వసూలు చెయ్యొచ్చని అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు