Vijay Devarakonda : పీరియాడిక్ డ్రామాగా విజయ్ సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో!

Vijay Devarakonda : టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడిగా రాణిస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసిమీదున్నాడు. గత కొన్నాళ్లుగా సరైన విజయం లేక డీలా పడ్డ ఈ రౌడీ హీరో లాస్ట్ ఇయర్ ఖుషి తో యావరేజ్ రిజల్ట్ ని అందుకోగా, ఈ ఇయర్ ఫ్యామిలీ స్టార్ తో దారుణమైన రిజల్ట్ ని అందుకున్నాడు. నిజానికి ఈ సినిమాతో భారీ హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని డిజాస్టర్ కావడమే కాకుండా విజయ్ పైన పలు ట్రోల్స్ వచ్చాయి. అన్నిటికి మించి విజయ్ మార్కెట్ పడిపోయిందని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. ఒకప్పుడు స్టార్ హీరో అయ్యే దిశగా దూసుకుపోయిన విజయ్ వరుస ప్లాప్ లతో మీడియం రేంజ్ హీరోల్లో కూడా చాలా వెనుకబడిపోయాడు. అయితే తన సినిమాల వరకు పెర్ఫార్మన్స్ పరంగా న్యాయం చేస్తున్నా, సినిమాల సెలెక్షన్స్ మాత్రం అంతగా లేదు. అది తెలుసుకున్న విజయ్ ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నాడు. పక్కాగా మంచి స్క్రిప్ట్ లని ఎంచుకుంటూ వరుస క్రేజీ ప్రజెక్టులని లైన్లో పెట్టాడు. ఫ్యామిలీస్టార్‌ రిలీజ్‌ తర్వాత జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు విజయ్. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుని లైన్లో పెట్టాడు. టాక్సీవాలా డైరెక్టర్ సాంకృత్యాన్‌ తో ఓ భారీ సినిమా చేయనున్నాడు.

పీరియాడిక్ డ్రామాతో..

తాజాగా విజయ్ దేవరకొండ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఫిక్స్ అయిందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి అన్నీ పనులు చకచకా జరుగుతున్నాయి. టాక్సీవాలా డైరక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ తో ఈ సినిమా చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. ఈ నెల చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉండే అవకాశం ఉందిట. ఇక ఈ సినిమా భారీ పీరియాడిక్‌ చిత్రంగా తెరకెక్కిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇక ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని సమాచారం. అందుకోసమే విజయ్ ఇప్పుడు రాహుల్‌ మూవీ కోసం రాయలసీమ యాస నేర్చుకుంటున్నారట. అప్పట్లో నోటా సినిమా కోసం తమిళ్ నేర్చుకున్న విజయ్ ఇప్పుడు, రాయల సీమ స్లాంగ్ కోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇక సమ్మర్ చివర్లో ఈ సినిమా మొదలుకానుందని సమాచారం.

వరుసగా పాన్ ఇండియా సినిమాలు..

ఇక విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి. ఇంతకు ముందు లైగర్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. మొన్న వచ్చిన ఖుషి ని కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసారు. ఇక హిట్ అయినా ప్లాప్ అయినా విజయ్ దేవరకొండ ఇక మీదట చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండ ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్న ప్రాజెక్ట్ ఈ నెలలో మొదలుకానుండగా, మైత్రి మూవీ మేకర్స్ తో పాన్ ఇండియా సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఆ తర్వాత రాజావారు రాణీవారు దర్శకుడు రవి కిరణ్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఏది ఏమైనా విజయ్ చేయబోయే చిత్రాలన్నీ క్రేజి కాంబోలని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు