Criminal Case on Bandla Ganesh : బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు

Criminal Case on Bandla Ganesh : టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో హీరా గ్రూప్ సీఈఓ నౌహెరా షేక్ తన ఇంటిని కబ్జా చేశారంటూ బండ్ల గణేష్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి విలువ రూ. 75 కోట్లు అని సమాచారం. అయితే ఫిబ్రవరి 15న తన ఇంటిని విడిచి పెట్టాలని అడగడానికి బండ్ల గణేష్ ఇంటికి వెళ్ళగా, నౌహెరా షేక్‌ను బండ్ల గణేష్ నిర్బంధించి బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, గణేష్‌కు బదులుగా షేక్ పై వాళ్ళు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో నౌహెరా షేక్ న్యాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి ఈ విషయాన్ని తెలియజేశారు. అనంతరం ఫిల్మ్ నగర్ పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 341, 506 కింద బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

అసలు వివాదం ఏంటంటే?

సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ గణేష్ తన ఇంట్లో కిరాయికి ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తన ఇంటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ నౌహెరా షేక్ చేసిన కంప్లైంట్ మేరకు ప్రస్తుతం ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ వివాదం ఎలా స్టార్ట్ అయ్యిందంటే.. నౌహెరా షేక్ ఫిలిం నగర్ లోని తన ఇంటిని బండ్ల గణేష్ కు నెలకు లక్ష రూపాయల చొప్పున అద్దెకి ఇచ్చారని సమాచారం.

- Advertisement -

అయితే ఆయన గత కొంతకాలం నుంచి కిరాయి ఇవ్వకపోగా గూండాలను పెట్టి తనను బెదిరిస్తున్నాడని, తన ఇంట్లోకి తననే రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఇంటిని ఖాళీ చేయాలని బండ్ల గణేష్ ని అడగగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, గూండాలు, రాజకీయ నాయకుల సహాయంతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ముందుగా ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నౌహెరా షేక్.

ఈ నేపథ్యంలోనే తాను బండ్ల గణేష్ పై కేసు పెట్టమని పోలీస్ స్టేషన్ కు వెళ్తే, వాళ్లు తిరిగి నౌహెరా షేక్ పైనే కేసు పెట్టారని తెలుస్తోంది. దీంతో ఆమె డైరెక్టుగా డిజిపి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుతం బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

కాగా చాలా కాలంగా బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న బండ్ల గణేష్ పై ఏకంగా ఇల్లు కబ్జా అంటూ ఓ మహిళ పిర్యాదు చేయడం, క్రిమినల్ కేసు నమోదు కావడంతో ఆయన దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు