అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్లా. కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్పై విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా నటన మరింత అద్భుతం. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్, ఫరీయా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ” లైక్ షేర్ సబ్ స్క్రై బ్”. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడ్వెంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళితో వర్క్ తన డ్రీమ్ అని, రాజమౌళి గారి దర్శకత్వంలో నటించాలని తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది. రాజమౌళి సినిమాలు అన్నీ చూశానని.. ఆయన మూవీలో ఛాన్స్ వస్తే నా కల నెరవేరినట్లేనని తన మనసులోని మాటని బయటపెట్టింది చిట్టి. ఇక తాను ఎవరితో సినిమాలు చేసినా, చేయకపోయినా మేర్లపాక గాంధీ గారితో సినిమాలు చేస్తే ఆయనతోనే లైఫ్ లాంగ్ సినిమాలు చేస్తుంటానని.. ఆయన అంటే తనకు అంత ఇష్టమని చెప్పింది. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.