NTR: నందమూరి ఫ్యామిలీ అలా చేస్తుందా..? తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్..!

నందమూరి తారకరత్న మరణాన్ని తన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. కుటుంబ సభ్యులకే కాదు తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకొని శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరోగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తారకరత్న తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారు.
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న తారకరత్న ఇక రాజకీయాలలో రాణిస్తారని అంతా భావించిన తరుణంలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఆయన మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన ఆయన భార్య అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూనే ఉన్నారు. ఆమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే పోస్టులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన మరో ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.
“మన పిల్లల కోసం నేను ఇంకా ఇలా స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. నా వరకు నువ్వే నా బలం. నువ్వు నాకు కావాలి నాన్న. నేను బాధపడుతున్నాను. ఒంటరిగా ఉన్న, ఓటమిలో ఉన్న పైకి లేపేందుకు నువ్వు నాకు కావాలి. నేను వెనక్కి తిరిగి చూసుకోవలసిన రోజు అంటూ వస్తుందని అనుకోలేదు. నువ్వు ఎప్పుడు పైనుండి నన్ను చూస్తూనే ఉంటావని నాకు తెలుసు. నీకోసం నా గుండెల్లో నుంచి రక్తం కారుతుంది బంగారు. ఇలాంటి గందరగోళంలో నువ్వు నా తోడు లేవని బాధగా ఉంది” అంటూ రాసుకొచ్చింది. దీంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్న ఫ్యామిలీని పట్టించుకోవడంలేదని, అందుకే ఆమె ఇలా బాధపడిపోతుందని నందమూరి ఫ్యామిలీపై మండిపడుతున్నారు నెటిజెన్లు. ఈ ఇష్యూని ఎక్కడికో లాగి లింక్ పెట్టి నందమూరి ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు.Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు