Nani30: ఈ హీరోయిన్ సీరియల్స్ లో నటించిందని తెలుసా?

సీతారామం చిత్రం తో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా తన నటనతో, అభినయం తో ఆడియన్స్ ని ఫిదా చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా లో సీతగా, యువరాణి నూర్జహాన్ గా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. సీతారామం చిత్రం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడింది. మహారాష్ట్ర కు చెందిన ఈ బ్యూటీ మొదట బాలీవుడ్ లో నటించినా అసలైన గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగులోనే.

అయితే మృణాల్ ఠాకూర్ పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిందని ఎంతమందికి తెలుసు? అవును.. ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ లో నటించింది. 2012 లో “యే ఖామోషియాన్” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ భామ. ఆ తర్వాత 2014 లో వచ్చిన “కుంకుమ్ భాగ్య” సీరియల్ లో హీరోయిన్ చెల్లిగా నటించి బుల్లితెర పై మంచి పాపులారిటీ ని సంపాదించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొనింది.

ఇక 2014 లో “విట్టి దండు” అనే మరాఠీ చిత్రంలో తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత “సూపర్30” చిత్రంలో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. అయితే హీరోయిన్ గా తనకి మంచి స్టార్ డమ్ వచ్చింది మాత్రం సీతారామం తోనే. ఇక తాజాగా గుమ్రాహ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో “నాని30” సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ లో మరో మూడు ప్రాజెక్టులతో బిజీ గా ఉంది. ఏది ఏమైనా సీరియల్స్ లో హీరోయిన్ గా, చిన్న పాత్రల్లో నటించి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ రేంజ్ కి మృణాల్ ఠాకూర్ ఎదిగిపోయిందంటే గ్రేట్ అనే చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు