Chiranjeevi: భోళా శంకర్ రెండో పాట.. మహతి ఈసారైనా మెప్పించాడా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు విడుదలైన టీజర్ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, ఫస్ట్ లిరికల్ సాంగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. భోళా శంకర్ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ చాలా వరకు మెగాస్టార్ పైన మాత్రమే ఫోకస్ పెట్టగా, ఇతర విభాగాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయారన్నది వాస్తవం. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో బాగా శ్రద్ధ పెట్టాల్సింది.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో రెండో పాట రిలీజ్ అయింది. “జామ్ జామ్ జజ్జనక” అంటూ సాగే ఈ పాట మంచి క్యాచీ ట్యూన్స్ తో మెగా అభిమానులనే కాకుండా కామన్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ కలిసి పాడడం జరిగింది. అయితే మొదటి సాంగ్ తో మెప్పించలేకపోయిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ ఈ పాటతో
ప్రేక్షకులని మెప్పించాడు. ఇక ఈ పాట పాడిన అనురాగ్ కులకర్ణి వాయిస్ మెగాస్టార్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇక పాట మధ్యలో ఇటీవల ఫేమస్ అయిన జానపద పాట నర్సపెల్లె సాంగ్ కూడా ఇందులో భాగంగా ప్లే చేయడం అంతగా ఆకట్టుకోలేదు. ఎందుకంటే పాట ఉన్నదే మూడు నిమిషాలు, అందులో అర నిమిషం దీనికే సరిపోయింది.

- Advertisement -

ఇక ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా,  సినిమాలో ఉన్న సగం మంది తారాగణం ఈ పాటలో కనిపించడం జరిగింది. ఇక భోళా శంకర్ సినిమాను ఆగష్టు11 న విడుదల చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు