Prabhas : ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్

ఆదిపురుష్ సినిమాపై రోజు రోజుకి ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇదివరకే రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలు సూపర్ హిట్ అవడంతో సినిమా రిలీజ్ కోసం అందరిలో వెయిటింగ్ మొదలయిందని చెప్పొచ్చు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీత గా కృతి సనన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.

దాదాపు ఈ సినిమాపై మేకర్స్ ఇప్పటికే 700కోట్లు ఖర్చు చేయగా, ఇండియాలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సినిమాగా ఆదిపురుష్ నిర్మితమైంది. అయితే ఇటీవలనే రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆదిపురుష్ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో అన్ని భాషల్లో సినిమాని భారీ రేట్ కి కొంటున్నారు. తెలుగులో ఆదిపురుష్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 160 కోట్లకి తీసుకోగా. అలాగే హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా ఆదిపురుష్ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడైంది.

- Advertisement -

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించగా, ఆదిపురుష్ సినిమా కూడా ఇదే విధమైన విజయాన్ని సాధిస్తుందని సినిమా యూనిట్ అంత నమ్మకంగా ఉన్నారు.

అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుండటంతో రేపు(జూన్6) సాయంత్రం తిరుపతి లో ఈ సినిమాకి సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్ కి చిన్నజీయర్ స్వామి ప్రత్యేక అతిథిగా హాజరవనున్నారు. అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఈ ఈవెంట్ కి రానుండగా, ఆదిపురుష్ మేకర్స్ ఫ్యాన్స్ అందరికి ఈ ఈవెంట్ లో ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

అదేంటంటే ఆదిపురుష్ సినిమాకి సంబంధించి రెండవ ట్రైలర్ ని ఈ ఈవెంట్ లోనే రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. అంతే కాదు ఈ ట్రైలర్ కి రాముడి విశ్వరూపం అంటూ ట్యాగ్ కూడా పెట్టారంట. ఈ ట్రైలర్ లో ఎక్కువగా లంక దహనంకి సంబందించిన షాట్స్ ఉండబోతున్నట్టు సమాచారం. ఇదే గనక నిజమైతే ఈవెంట్ కి వెళ్లే ఫ్యాన్స్ అందరు డబుల్ హ్యాపినెస్ తో తిరిగి రావడం కన్ఫామ్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు