టాలీవుడ్ లో ప్రస్తుతం పార్ట్2 ల ట్రెండ్ జోరుగా సాగుతున్న విషయం అందరికి తెల్సిందే. గతంలో సింగల్ సినిమాలనే దృష్టి పెట్టిన మేకర్స్ అంత, ఇప్పుడు హిట్టైన సినిమాలకి సీక్వెల్ పైన కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ విధంగా చేయడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సినిమా హిట్టవడం, జనాలకి నచ్చడం అనేది అతి పెద్ద టాస్క్ గా మారడంతో, హిట్టైన సినిమాల సీక్వెల్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది.
బాహుబలి సినిమాతో ఊపందుకున్న ఈ పార్ట్ 2 ట్రెండ్, పెద్ద సినిమాలకు మాత్రమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలు, మరియు చిన్న సినిమాకు విస్తరించింది. ఇలాంటి ధోరణిలో వచ్చి సూపర్ హిట్టైన సినిమానే డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. విమల్ కృష్ణ అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2022 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ టిల్లు పాత్ర ద్వారా ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. గతంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా చాలా సినిమాలే చేసిన ఆయనకి బ్రేక్ ఇచ్చింది మాత్రం డీజే టిల్లు సినిమానే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ సరసన ఈ సినిమాలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ని వచ్చే సెప్టెంబర్ 15న లాక్ చేసారు. అయితే సెప్టెంబర్ 18న వినాయక చవితి ఉండటంతో, ఈ సెలవులని దృష్టిలో పెట్టుకొని ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశి సినిమాని నిర్మిస్తుండగా, మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.