పూజా హెగ్డే… ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపించిన పేరు. ఎందుకంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం మూవీలో ముందుగా పూజా హెగ్డేను తీసుకోవడం, పూజా కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం, షూట్ చేయడం లాంటివి జరిగిన తర్వాత అకస్మాతుగా మూవీ నుంచి ఆమెను తప్పించారు. దీనిపై రీసెంట్ గా ప్రొడ్యూసర్ ఒక క్లారిటీ ఇచ్చినా ఇంకా ఏదో అనుమానం.
గుంటూరు కారం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా పూజాను తప్పించారనే వార్తలు కొన్ని రోజుల క్రితం వచ్చాయి. దీంతో పూజా కెరీర్ ముగిసిపోయిందని, ఇక ఇంట్లో కూర్చోవడమే అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ వార్తలను అన్నింటినీ పక్కన పెడితే, ఈ బ్యూటీ మాత్రం ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. రోజులో ఎక్కువ టైం జిమ్ లోనే గడిపేస్తుందట.
ఫిట్ నెస్ పెంచి, మళ్లీ ఇండస్ట్రీలో ఫామ్ లోకి రావాలని అనుకుంటుందా? లేదా మరి ఏదైనా కారణం ఉందో తెలియదు. కానీ, ఇప్పుడు పూజా జిమ్ లోనే ఎక్కువ టైంని గడుపుతుందట. పూజా జిమ్ లో కసరత్తులు మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో బాక్సింగ్ కూడా చేస్తుందట. అందుకోసం ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ని కూడా పెట్టుకుందని టాక్.
తాజాగా ఆ ట్రైనర్ తో బాక్సింగ్ ప్రాక్టిస్ చేసినప్పుడు, పూజాకు గాయాలు అయ్యాయట. పూజా కూడా బాక్సింగ్ చేసే టైంలో తనకు గాయాలు అయ్యాయని కన్ఫామ్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ లో గాయాల ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్కి Battle Scars (యుద్ధానికి చెందిన గాయాలు) అని కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News