SSMB 29 Update : SSMB 29లో కేజీఎఫ్ హీరోయిన్… ఐశ్వర్యరాయ్ కంటే ఆమె బెటరా?

SSMB 29 Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు జక్కన్న కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ జక్కన్న ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమా పనులను సైలెంట్ గా జరిగేలా చూసుకుంటున్నారు.

ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటే, మహేష్ బాబు ఈ సినిమాకి కావాల్సిన లుక్, మేకోవర్ కు సంబంధించిన పనుల్లో పడిపోయారు. రీసెంట్ గా మహేష్ కాస్త హెయిర్ పెంచి కనిపించిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక జక్కన్న ఈ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలో కేజిఎఫ్ లో నటించిన ఓ హిందీ సీనియర్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే…

కేజీఎఫ్ హీరోయిన్ కీ రోల్..

దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాకు సంబంధించిన ప్రతి విషయం గురించి కేరింగ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ సీనియర్ నటి విషయంలో ఆయన తీసుకున్న డేరింగ్ డెసిషన్ పై చర్చ మొదలైంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో రూపొందబోతున్న SSMB 29 సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ను సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం.

- Advertisement -

ఐశ్వర్యారాయ్ కంటే బెటరా?

అయితే ముందుగా ఈ రోల్ కోసం ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారట. కానీ ఇటీవల కాలంలో పలు వెబ్ సిరీస్ లతో పాటు కేజిఎఫ్ 2 సినిమాతో డేరింగ్ లేడీగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న రవీనా అయితే తమ పాత్రకు పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించి రాజమౌళి ఆమె వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఆమె ఐశ్వర్యరాయ్ కంటే బెటరా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఈ విషయం ఒకవేళ అదే నిజమైతే రవీనా బిగ్ ప్లస్ కాబోతోందని అంటున్నారు.

కాగా ఈ మూవీ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కాబోతుందని ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ మూవీ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ వెల్లడించారు. ఇప్పటికే రాజమౌళి SSMB 29 మూవీ పనులన్నీ మొదలు పెట్టారని, సైలెంట్ గా వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహేష్ బాబు కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. చాలా కాలం క్రితమే విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని వెల్లడించారు. అయితే రాజమౌళి తన సినిమా షూటింగ్ కంటే ముందే అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి పకడ్బందీగా, పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తారు అన్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు