SSMB29 latest buzz: మహేష్, రాజమౌళి సినిమాపై విజయేంద్ర ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్

SSMB29 latest buzz

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే సినిమాపై ఇటీవల కాలంలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేస్తున్న ఒక్కో కామెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాములుగానే మహేష్, రాజమౌళి తో సినిమా చేస్తున్నాడని న్యూస్ వచ్చిన దగ్గరి నుండి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఒక రేంజ్ అంచనాలుండగా, రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ అంచనాలను అంతకంతకు పెంచుతూ పోతున్నారు.

గతంలోనే రైటర్ విజయేంద్ర ప్రసాద్ మహేష్ తో రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ బాబు గత చిత్రాలలాగా మెసేజ్ లు గట్రా ఉండవని క్లారిటీ ఇచ్చిన ఈయన, ఆ సినిమా ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే ఒక హై ఎండ్ యాక్షన్ డ్రామా అని చెప్పగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు రైటర్ విజయేంద్ర ప్రసాద్.

అయితే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో హాలీవుడ్ యాకర్స్ ను కూడా తీసుకునే ఆలోచనలున్నాయని ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకు ఎవరిని అప్రోచ్ అవ్వలేదని స్క్రిప్ట్ తొందర్లోనే ఫైనల్ అయ్యాక స్క్రిప్ట్ కు అవసరమైతే హాలీవుడ్ నుంచి కూడా యాక్టర్స్ ను తీసుకుంటాం అని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పగా, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి.కాగా ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవబోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం మహేష్ రాజమౌళిల సినిమా పట్టాలెక్కనుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు