Samantha : వెనక్కుతీసుకుంది

సినీ ఇండస్ట్రీలో యాక్టర్లు ఎంత త్వరగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారో, అంతే త్వరగా వివాహ బంధానికి బ్రేకులు వేస్తున్నారు. ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. టాలీవుడ్ లో నాగచైతన్య – సమంత బెస్ట్ క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచిన నాగచైతన్య-సమంత గతేడాది విడాకులు తీసుకొని ఆశ్చర్యాన్ని కలిగించారు. వివాహమైన నాలుగేళ్లకే విడిపోవడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

ఏ మాయ చేసావే సినిమా సెట్స్ పైన కలిసిన వీరిద్దరి స్నేహం, ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరు విడిపోయి చాలా రోజులు అవుతున్నా ఇండస్ట్రీలో మాత్రం వీరి గురించి ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. తాజాగా వీరు గతంలో కొనుక్కున్న ఇల్లుకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివాహం తర్వాత కలిసి ఉన్న ఇంటిని ఇప్పుడు అత్యంత ధరకు సమంత కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. “సమంత – చైతు మా ఇంటి దగ్గర లోనే ఒక హౌస్ కొన్నారు. ఆ ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత వాళ్లు ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని షిఫ్ట్ అవ్వాలి అనుకున్నారు. అందుకోసం నా దగ్గర కొన్న ఫ్లాట్ ని అమ్మేశారు. అయితే ఆ ఇండిపెండెంట్ హౌస్ రెడీ అయ్యే వరకు ఇదే ఇంట్లో ఉండడానికి ముందుగానే అంగీకారం ఏర్పరచుకున్నారు. దీనికి ఇల్లు కొనుక్కున్న వాళ్లు కూడా అంగీకరించారు. ఇంతలోనే సామ్ – చై మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక ఆ తర్వాత మంచి ఇంటి కోసం సమంత బయట ఎక్కడెక్కడో చూసి వచ్చింది. కానీ ఎక్కడ నచ్చలేదు. దీంతో తాము అమ్మేసిన ఇంటినే సమంత ఇదివరకంటే ఎక్కువ ధర చెల్లించి మళ్లీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ ఇంటిలో తన తల్లితో సమంత అక్కడే ఉంటుంది.” అని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు