karthikeya 2 : పాజిటివ్ వైబ్స్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోగా పేరున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. యువ డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక అగర్వాల్, టి.జీ విశ్వప్రసాద్ నిర్మించారు. 2014లో వచ్చిన థ్రిల్లర్ కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుడికి సంబంధించిన రహస్యాలను ఛేదించే నేపథ్యంలో, ద్వారకా చుట్టూ సాగే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. కార్తికేయ-2 ఆగస్టు 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాను ముందుగా జూలై 22న విడుదల చేయాలని చిత్రం బృందం భావించారు. కానీ, నాగ చైతన్య థాంక్యూ సినిమా కూడా అదే రోజు విడుదల అయింది. దీంతో నిర్మాత దిల్ రాజు కోరిక మేరక జూలై 22 పోటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత రిలీజ్ డేట్ ను ఆగస్టు 12కు ఫిక్స్ చేశారు.

తాజాగా కార్తికేయ-2 సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా సెన్సార్ బోర్డ్ విధించలేదట. అంతే కాకుండా, U/A సర్టిఫికెట్ కూడా వచ్చిందని చిత్రం బృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. సినిమాలో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు చెప్పినట్లు తెలిపారు. అలాగే హీరో నిఖిల్ తన ట్విట్టర్ లో.. సెన్సార్ బోర్డు రిపోర్టును ట్వీట్ చేస్తూ, కార్తికేయా-2 టీంకు పాజిటివ్ వైబ్స్ వచ్చాయని తెలిపాడు. ఆగస్టు 12న రిలీజ్ అవుతుందని ట్వీట్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు