Highest Paid villain: ప్రభాస్ రేంజ్ లో విలన్ రెమ్యునరేషన్..కమల్ మాత్రం కాదు..!

సాధారణంగా ఒక సినిమా తెరపై బాగా పండాలి ..హీరోని బాగా ఎలివేట్ చేయాలి అంటే అందుకు దీటుగా విలన్ కూడా ఉండాలి..ఇక విలన్ సరైనోడు లేకపోతే హీరోని ఎంత చూపించినా ప్రేక్షకులు ఆ కథను మెచ్చుకోరనడంలో సందేహం లేదు.. అందుకే హీరోకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆ సినిమాలో విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దర్శకులు.. మరోవైపు తెరపై కనిపించేటప్పుడు ఇద్దరికీ సమాన పాత్రలే ఇచ్చినా పారితోషకం విషయంలో మాత్రం విలన్ కంటే హీరోకే ఎక్కువ పారితోషకం ఇస్తారనడంలో సందేహం లేదు. అందుకే వందల కోట్ల రూపాయలను హీరోలు పారితోషకంగా తీసుకుంటే.. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే విలన్లకి పారితోషకం ముట్టచెబుతూ ఉంటారు.. కానీ ఇక్కడ ఒక విలన్ కి మాత్రం ఏకంగా స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ లో పారితోషకం ఇస్తూ ఉండడం తెలిసి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది .. ఇంతకీ ఎవరా హీరో ? ఏమిటా సినిమా? ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

పాన్ ఇండియా సినిమా..
ఒకప్పుడు సినిమాలు అంటే హీరోల గురించే మాట్లాడుకునేవారు..టాప్ సెలబ్రిటీల గురించే చర్చలు జరిగేవి.. కానీ ఇప్పుడు సినిమా పాన్ ఇండియా గా మారిపోయిన నేపథ్యంలో హీరోలకు మించి ఇతర రోల్స్ చేసే వారికి కూడా క్రేజ్ వస్తోంది.. పాన్ ఇండియా సినిమాల కారణంగా విలన్ పాత్రలకు ప్రాధాన్యం పెరిగింది.. హీరోకి పోటీగా ఉండే విలన్ క్యారెక్టర్ లను డైరెక్టర్లు అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పాన్ ఇండియా హీరోను పాన్ ఇండియా సినిమా కోసం విలన్ గా సెలెక్ట్ చేశారట.. ఆ సౌత్ సెలబ్రిటీకి ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.. ఇదే గనుక నిజమైతే ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పవచ్చు.

ఎవరా హీరో..
ఆ నటుడు ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి..పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఇక ఆయనకి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. తన అప్ కమింగ్ సినిమాలలో విలన్ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆయన ఎవరో కాదు కేజీఎఫ్ సినిమాలతో హీరోగా తన పరంపరాను కొనసాగిస్తున్నారు కన్నడ హీరో యశ్..

- Advertisement -

రామాయణంలో రావణుడిగా..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తన అప్కమింగ్ సినిమా రామాయణంలో రావణుడి పాత్ర కోసం యశ్ ను సెలెక్ట్ చేశారు. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సౌత్ హీరోయిన్ సాయి పల్లవి నటించనుండగా.. బాలీవుడ్లో విలన్ ఎంట్రీ ఇవ్వడానికి యశ్ ఇప్పుడు సిద్ధమయ్యారు.. ఈ సినిమాలో రావణుడి పాత్ర చేయబోతున్న ఈయన ఏకంగా రూ.150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.. ఈ లెక్కన చూసుకుంటే భారత సినీ పరిశ్రమంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న విలన్ గా యశ్ రికార్డు సృష్టించబోతున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు