నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పనిలేదు. రష్మిక తన సినిమాలతో పాటు ఆమె చేసే పనులతో కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో వరుసగా రెండు సార్లు 300 కోట్లు కలెక్ట్ చేసిన హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ఈమె పుష్ప మూవీతో ఒక సారి 300 కోట్ల క్లబ్ లో చేరగా, ఇటీవల వారీసు తో రెండోసారి 300 కోట్ల క్లబ్ లో చేరింది. దీనిలో వారీసుతో పెద్దగా రష్మికకు పేరు రాలేదు. కానీ, పుష్పతో అంతర్జాతీయంగా నేషనల్ క్రష్ కు మంచి గుర్తింపు వచ్చింది.
ఇదిలా ఉండగా, టాలీవుడ్ తో పాటు సౌత్, బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ కి 5 నుంచి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అయితే గత కొంత కాలంగా, తనపై వస్తున్న ట్రోల్స్, రూమర్స్ కారణంగా, అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే కొత్తగా అవకాశాలు వస్తున్నాయి. నితిన్, వెంకీ కుడుములతో భీష్మ తర్వాత మరోసారి నేషనల్ క్రష్ ఓ సినిమా చేయబోతుంది. అలాగే టాలీవుడ్ లో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం కోసం చర్చలు జరుపుతుంది.
కెరీర్ ను మళ్లీ బిల్డ్ చేసుకుంటున్న రష్మిక ఫేస్ లో సడన్ గా కొన్ని మార్పులు కనిపించాయి. తాజాగా ఈ నేషనల్ క్రష్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. అందులో రష్మిక పెదాలు, ముక్కు భాగాలు గతం కంటే కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. దీంతో రష్మిక ఆ రెండు పార్ట్ లకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే కొంత మంది రష్మిక ఫ్యాన్స్ మాత్రం.. అది ప్లాస్టిక్ సర్జరీ కాదని, మేకప్ కాస్త ఎక్కువ కావడంతో అలా కనిపిస్తుందని చెబుతున్నారు. కానీ, రష్మిక పాత ఫోటోలను, ఈ కొత్త ఫోటోలను గమనిస్తే, సర్జరీ చేసుకుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం ఉండదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News