Karan Johar..బాలీవుడ్ లో అందరితో కలిసిపోయి ఎప్పుడూ పార్టీలను ఎంజాయ్ చేస్తూ ఉండే డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా కరణ్ జోహార్ పేరే వినిపిస్తూ ఉంటుంది.. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గుట్టు విప్పడంలో కూడా ఈయన ప్రథమ స్థానంలో ఉంటారు ఇప్పటికే కాఫీ విత్ కరణ్ అనే షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీల ఎఫైర్స్ విషయాలను కూడా బయటకు తెప్పించి ఎంతోమందికి ఎన్నో తెలియని విషయాలను అందరి ముందు ఉంచారు కరణ్ జోహార్.. టాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హోదా దక్కించుకున్న అందరి సెలబ్రిటీలను తన షోకి పిలిపించి మరి వారితో ఎన్నో నిజాలను బయటపెట్టించారు అందుకే కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..
కరణ్ జోహార్ పోస్ట్ వైరల్..
ఒకరకంగా చెప్పాలంటే కరణ్ జోహార్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత, యాంకర్ కూడా.. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రం కూడా ఈనెల ఆఖరిలో విడుదల కాబోతోంది.. బాలీవుడ్లో బడా సెలబ్రిటీలతో మంచి స్నేహబంధం కలిగి ఉన్న కరణ్ జోహార్ .. నిరంతరం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ ఉంటారుఇప్పుడు తాజాగా కరణ్ జోహార్ షేర్ చేసిన ఒక పోస్ట్ బాలీవుడ్ లోనే పెద్ద దుమారాన్ని రేపేలా కనిపిస్తోంది. ఒక కమెడియన్ తనను అవమానించాడంటూ ఒక ఎమోషనల్ పోస్టుని రాసుకోచ్చారు.. అసలు విషయంలోకి వెళ్తే కరణ్ జోహార్ తన తల్లితో కలిసి టీవీ చూస్తున్న సమయంలో ఒక రియాలిటీ షోకు సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయిందని.. ఆ ప్రోమోలో ఉండేటువంటి కమెడియన్ కరణ్ జోహార్ ను చాలా దారుణంగా అవమానించారని ఆ సమయంలో తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు కరణ్ జోహార్.
కమెడియన్ చేతిలో అవమానం..
అయితే ఇలాంటివన్నీ ఎక్కువగా సోషల్ మీడియాలో వచ్చాయంటే అందుకు ఏదైనా అర్థం ఉంది.. కానీ ఇండస్ట్రీలో ఒక పేరు ఉన్న కమెడియన్ కూడా ఇలా చేయడం తనకు చాలా బాధను కలిగించిందని.. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు కావస్తున్నా.. తనను ఇలా అవమానించడం చాలా బాధాకరంగా ఉంది అంటూ ఒక ఎమోషనల్ పోస్టుని రాసుకోచ్చారు.. ఈ ప్రోమో చూసిన తర్వాత తనకు కోపం రాలేదు కానీ చాలా బాధ కలిగింది అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చారు కరణ్ జోహార్. మొత్తానికైతే కరెంజ్ జోహార్ చేసిన ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారుతుంది 25 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ కి ఇలాంటి అవమానం అందులోనూ తన తల్లి ముందే అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు..
కరణ్ జోహార్ సినిమాలు..
కరణ్ జోహార్ నిర్మించిన సినిమాల విషయానికొస్తే ఇటీవలే రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని కోసం మెగా ఫోన్ పట్టారు. రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం గతేడాది జూలైలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.