Rashmi Gautam.. రష్మీ గౌతమ్.. జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకొని ఇప్పుడు స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్ షో తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఇక ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షో లతో పాటు ఢీ వంటి డాన్స్ కాంపిటీషన్ షోలకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా దూసుకుపోతోంది.. అంతేకాదు సినిమా స్పెషల్ ఈవెంట్లకు , ఆడియో లాంచ్ లకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది రష్మీ.. ఇక యాంకరింగ్ ను కాస్త పక్కన పెడితే తన అందచందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వయ్యారాలతో ఊపిరాడకుండా చేస్తుందని చెప్పవచ్చు.. రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె జంతు ప్రేమికురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే..
జంతు ప్రేమకు రాలే కానీ ట్రోల్స్ తప్పవు..
ముఖ్యంగా జంతువులకు ఎవరి వలన అయినా అపాయం కలిగిందంటే వాటిని వెంటనే షేర్ చేస్తూ విచారం వ్యక్తం చేస్తూ ఉంటుంది ..ఈ క్రమంలోనే పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ఒక్కొక్కసారి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో వీధి కుక్కలకు ఆహారం కూడా ఏర్పాటు చేసిన ఈమె వీధి కుక్కలపై ఎవరైనా దాడి చేస్తే తనదైన శైలిలో గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది.. అయితే ఈమె చేసే పోస్టు లకి నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది రష్మీ.. వీధి కుక్కలు చిన్నపిల్లలను చంపేస్తుంటే ఆ కుక్కలను చంపిన వారిపై ఈమె విరుచుకుపడుతుంటే.. నెటిజన్లు సైతం ఈమెకు పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తూ గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటారు .. అయితే ఇప్పుడు తాజాగా ఒక నెటిజన్ ఏకంగా హద్దులు దాటుతూ నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అంటూ గట్టిగా కామెంట్ చేశాడు. మరి ఇంత పెద్ద పదం వాడడానికి.. రష్మీ అసలు ఏం షేర్ చేసింది .? ఆ నెటిజెన్ ఎంత హర్ట్ అయ్యారో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి..
తాజాగా రష్మీ గౌతమ్ ఒక వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతున్న వీడియో షేర్ చేసింది.. ఇది దారుణం అంటూ వాపోయింది. మనం ఎందుకు ఇలాంటివి జరగకుండా ఆపలేకపోతున్నాము అంటూ ప్రశ్నించింది.. ఇక ఈ పోస్ట్ పై ఒక నెటిజన్ స్పందించారు.. ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు.. బట్టలు విడదీసి నగ్నంగా తిప్పుతున్నారు.. చంపేస్తున్నారు.. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు.. అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అంటూ గట్టిగా కామెంట్ చేశాడు.
రష్మీ గౌతమ్ ఘాటు రిప్లై..
ఇక ఈ కామెంట్ కి స్పందించిన రష్మీ గౌతమ్ ఇవాళ ఎద్దును చంపిన వాడు రేపు మీ పిల్లల్ని చంపుతాడు
. వాడికి మనిషికి పశువుకు తేడా తెలియదు.. ముందు నువ్వు బ్రెయిన్ వాడు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది ప్రస్తుతం రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది..దీంతో మళ్ళీ వార్తల్లో నిలిచారు రష్మీ గౌతమ్.
Brain vadaandi ee roju aavalu kukalu repu Mee pillalu
Okka sare okka manishi champadanki sidham aythi
Vadiki manishi ki pashu ki peda teda yemi kanpinchadu
Akada yeh dharmam Pani ki radu https://t.co/1sVCSbaSwD— rashmi gautam (@rashmigautam27) May 5, 2024