20 years for Arya: రీ యూనియన్ స్పెషల్ పార్టీ.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

20 years for Arya: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకటి రెండు సినిమాలలో నటించినా పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో మొట్టమొదటిసారిగా హీరోగా పరిచయమయ్యారు .. అయితే మొదట్లో
ఈ సినిమా చూసిన చాలామంది దారుణంగా అల్లు అర్జున్ ను ట్రోల్ చేశారు.. అయితే ఆ తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.. అప్పటివరకు ఇలాంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ రాకపోవడంతో ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. యూత్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది ఆర్య మూవీ.

20 years for Arya: Re union special party.. Who is the chief guest..?
20 years for Arya: Re union special party.. Who is the chief guest..?

రూ .4కోట్ల బడ్జెట్ తో రూ.30 కోట్లు లాభం..

దాదాపుగా ఈ సినిమా అన్ని ఏరియాలలో కూడా మంచి లాభాలను రాబట్టింది.. కేవలం నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమా తీస్తే.. మొత్తం మీద రూ.30 కోట్ల వరకు కలెక్షన్ వచ్చిందట. ఇందులో అల్లు అర్జున్ కు జోడిగా అను మోహత హీరోయిన్గా నటించినది.. అలాగే శివ బాలాజీ, సునీల్ ,వేణుమాధవ్ తదితర నటీనటులు సైతం ఆర్య సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది.. ఇప్పటికి ఆర్య సినిమాలోని పాటలు అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమా మే ఏడవ తేదీన 2004లో విడుదలయ్యింది.

ఆర్య సినిమాకి 20 ఏళ్లు..

ఇప్పటికి ఆర్య సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది.. ఈ చిత్రంతోనే సుకుమార్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. అలాగే ఆర్య సినిమాకి నాలుగు నంది అవార్డులు రావడం గమనార్హం. ఈ సినిమా ఈరోజుతో 20 సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఈ రోజున చిత్ర యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసి ఒక స్పెషల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారట.. అది కూడా హైదరాబాద్లో.. ఆర్య సినిమాకి సంబంధించి పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ ఫంక్షన్ గ్రాండ్ గా చేయబోతున్నారు.

- Advertisement -

చీఫ్ గెస్ట్ గా చరణ్..

అయితే ఇందుకు అల్లు అర్జున్ , సుకుమార్ దిల్ రాజు తో సహా ఆర్య చిత్రానికి పనిచేసిన యూనిట్ తో పాటు ఇతరులు కూడా హాజరు కాబోతున్నారు.. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ఆర్య సినిమాకి స్పెషల్ పోస్టులు చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. అంతేకాదు ఈ స్పెషల్ ఈవెంట్ కి రామ్ చరణ్ అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ గా మారుతోంది.ఇకపోతే సుకుమార్ తన 20 ఏళ్ల కెరియర్ లో ఎన్నో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సినిమాలతో కూడా మెప్పించారు.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు సుకుమార్.. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాతో బారి సక్సెస్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు