Vijay-Puri : హ్యాట్రిక్ కాంబినేషన్ రెడీ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా కెరిర్ ను మొదలుపెట్టాడు పూరి జగన్నాథ్. ఆ మధ్య వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. రామ్ పోతినేని తో చేసిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే టాలీవుడ్ లో హీరోలను రిపీట్ చేసే వారిలో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉంటారు. రవితేజ, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలను పూరిజగన్నాథ్ రిపీట్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో హీరోతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తో ఇప్పటికే లైగర్ సినిమా చేశాడు. ఆగస్టు 25న లైగర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే పూరి – విజయ్ కాంబినేషన్ లో మరో ప్రాజెక్టు ప్రకటించారు. జనగణమన అనే టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలియజేశారు.

అయితే ఈ రెండు చిత్రాలే కాకుండా ముచ్చటగా మూడో చిత్రానికి విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ కథను విజయ్ దేవరకొండ కు వినిపించగానే, ఓకే చెప్పేశారని వార్తలు వినిపిస్తున్నాయి. జనగణమన మూవీ పూర్తయిన తర్వాత వచ్చే ఈ సినిమా ప్రారంభిస్తారని టాక్. అధికారిక ప్రకటన కూడా అప్పుడే వెలువడే అవకాశం ఉందని సమాచారం. అయితే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మూడో సినిమా సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు రాజమౌళి తీసిన మగధీర, యమదొంగ లాంటి సినిమాల లాగే హ్యాట్రిక్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు