Keerthy Suresh News: పరువు పోతుంది… కీర్తి సురేష్‌కి హీరో ఘాటు వార్నింగ్?

కీర్తి సురేష్.. నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది. ఆ తరువాత మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో ఆమె నటనకి యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది.

అయితే గత కొంతకాలంగా కీర్తి సురేష్ కి వరుస అపజయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది. కేవలం కోలీవుడ్ సినిమాలలోనే నటిస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహానటి అసలు తెలుగు జనాలను పట్టించుకోవడమే మానేసింది. అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఇటీవల ఓ స్టార్ హీరోకి బాగా దగ్గరయిందట.

ఎంతలా అంటే ఆ స్టార్ హీరోతో నైట్ అవుట్ లు, పార్టీలు, పబ్ లు అంటూ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అతనితో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న కీర్తి సురేష్ ఫ్రెండ్ అయిన తెలుగు హీరో నేరుగా కీర్తి ఇంటికి వెళ్లి, అది కూడా వాళ్ళ అమ్మగారి ముందే సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అక్కడి కల్చర్ కి ఎడిక్ట్ అయితే పరువు పోతుందని, ఓ ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నానని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడట. దీంతో కీర్తి సురేష్ తల్లి సైతం ఆ తెలుగు హీరోకి సపోర్ట్ చేసి కీర్తి సురేష్ కి వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు