కీర్తి సురేష్.. నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది. ఆ తరువాత మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో ఆమె నటనకి యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది.
అయితే గత కొంతకాలంగా కీర్తి సురేష్ కి వరుస అపజయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది. కేవలం కోలీవుడ్ సినిమాలలోనే నటిస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహానటి అసలు తెలుగు జనాలను పట్టించుకోవడమే మానేసింది. అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఇటీవల ఓ స్టార్ హీరోకి బాగా దగ్గరయిందట.
ఎంతలా అంటే ఆ స్టార్ హీరోతో నైట్ అవుట్ లు, పార్టీలు, పబ్ లు అంటూ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అతనితో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న కీర్తి సురేష్ ఫ్రెండ్ అయిన తెలుగు హీరో నేరుగా కీర్తి ఇంటికి వెళ్లి, అది కూడా వాళ్ళ అమ్మగారి ముందే సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అక్కడి కల్చర్ కి ఎడిక్ట్ అయితే పరువు పోతుందని, ఓ ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నానని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడట. దీంతో కీర్తి సురేష్ తల్లి సైతం ఆ తెలుగు హీరోకి సపోర్ట్ చేసి కీర్తి సురేష్ కి వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.