ప్రస్తుతం భారతదేశమంతా ఎక్కడ చూసినా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతోంది ఈ సోమవారం అయోధ్యలో శ్రీరాముని మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే .ఇక ఈ ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు సినిమా, రాజకీయ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. అంతేకాదు వీరందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా అందాయి. అందులో భాగంగానే తెలుగు నాట ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులలో పద్మశ్రీ పురస్కార గ్రహీత కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఉన్నారు. అయితే రామ మందిరానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది. కానీ ప్రస్తుతం ఆయన వెళ్లడం లేదు అని సమాచారం. అంతేకాదు అందుకు గల కారణాలను కూడా ఆయనే వివరించారు.
మోహన్ బాబు మాట్లాడుతూ..ఇది రాముడు పుట్టిన దేశము.. రామ జన్మభూమి అని ప్రపంచం అంతటికి చాటి చెప్పేలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప పని చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనెల 22వ తేదీన జరిగే అయోధ్య రామయ్య మందిరం ప్రారంభోత్సవానికి ఊరూరు తరలి వెళ్తున్నారు. నాకు కూడా ఆహ్వానం అందింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా నేను రాలేకపోతున్నాను. నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాశాను అంటూ తెలిపారు మోహన్ బాబు.
ఇకపోతే మోహన్ బాబు చైర్మన్ గా ఉన్న ఫిలింనగర్ దైవ సన్నిధానంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక వాటి గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. ఫిలింనగర్ దైవ సన్నిధానం దేవాలయాన్ని ప్రజల అందరి కోసం నిర్మించాము.. ఇటీవల దైవ సన్నిధానం పాలకమండలి చైర్మన్ పదవిని నేను స్వీకరించాను.. ఇక రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దైవ సన్నిధానంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాను.. ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని చాలామంది భక్తులు చెబుతున్నారు. ఇక్కడ శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి , శ్రీ సాయిబాబా, శ్రీ రాముడు, లక్ష్మీనరసింహస్వామి , సంతోషిమాత ఇలా మొత్తం 18 మంది దేవుళ్ళు, దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. అంతేకాదు ఈ దేవాలయంలో 15 మంది బ్రాహ్మణోత్తములు , 18 మంది మూర్తులు కూడా ఉన్నారు అంటూ తెలిపారు. ఇక ఈ కారణాలవల్లే మోహన్ బాబు వెళ్లలేకపోతున్నట్లు సమాచారం.
For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News