Mark Antony: రీతూ కంటే ఆమెకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట!

Mark Antony:

కోలీవుడ్ స్టార్ విశాల్, ఎస్.జె.సూర్య కలిసి నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న ఈ సినిమా కథ మొత్తం గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగుతుంది. పైగా హీరో సహా అందరూ మార్క్ అంటోని లో గ్యాంగ్ స్టర్లే. ట్రైలర్ విజువల్స్ ని చూస్తే 80స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తూ, ఇప్పటికాలానికి కనెక్ట్ చేసే స్టోరీ ఇది. ఫోన్ నుండి టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.

అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో రీతూ వర్మ ఒకే ఒక్క షాట్ లో కనిపించి వెళ్ళిపోతుంది. పైగా సెకండ్ హీరోయిన్ గా చేసిన అభినయ ఏక్కువ సార్లు కనిపించింది. అంతే కాక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభినయ వచ్చింది కానీ రీతూ వర్మ రాలేదు. అంటే ఈ సినిమాలో తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఈవెంట్ కి రాలేదా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. పైగా సినిమా గురించి సోషల్ మిడియా లో పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. అంటే సినిమాలో రీతూ వర్మ కంటే అభినయకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అలిగిందా, లేక సినిమాపైనే లైట్ తీసుకుందా అనేది తెలియదు.

కానీ రీతూ వర్మ కి వేరే సినిమా ఛాన్సులు మాత్రం వస్తున్నాయి. అందుకే మార్క్ ఆంటోనీ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదని అంటున్నారు నెటిజన్లు. ఇక మార్క్ ఆంటోనీ లో విశాల్ ద్విపాత్రాభినయం యంగ్ హీరో రోల్ కి రీతూ వర్మ జోడిగా నటించిందని తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు