Sai pallavi: భోళా శంకర్ సినిమాలో “కీర్తి సురేష్” పాత్రను వదిలేసిన స్టార్ హీరోయిన్ ?

Sai pallavi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అనే పేరు ఉన్న మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ రూపొందింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు మెహర్ రమేష్ ఈ మూవీని తెరకెక్కించాడు.

అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ వల్ల భోళా శంకర్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ తో పాటు ఏ అంశంలో కొత్తదనం కనిపించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తొలిరోజు 15 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ కాబట్టి పర్వాలేదనిపించింది. రెండో రోజు నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి.

దాదాపు 80 కోట్ల ప్రీ రిలీజ్ టార్గెట్ తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు 25 కోట్లలోపే కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన చెల్లెలి పాత్ర కోసం మరో హీరోయిన్ అనుకున్నారట. ఆమె ఎవరో కాదు నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా మొదట సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారు.

- Advertisement -

అయితే సాయి పల్లవి మెగాస్టార్ పక్కన నటించే స్థాయి తనకి లేదని… ఆయనపై గౌరవంతో ఈ సినిమాను రిజెక్ట్ చేస్తున్నట్టు తెలిపింది. దీనితో ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ను తీసుకున్నారు. సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకోకుండా మంచిపని చేసింది అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు