SVC59 Update : విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబో రిపీట్.. టైటిల్ ఇదేనా?

SVC59 Update : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ మూవీ రిజల్ట్ తో నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఆ మూవీ రిజల్ట్ ను పక్కన పెట్టేసి ఆయన బ్యానర్లో రాబోతున్న 59వ సినిమాపై ఫోకస్ పెట్టారు ఈ బడా ప్రొడ్యూసర్. ముందుగానే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందబోతున్న 59వ సినిమాకు సంబంధించిన అప్డేట్ మే 4న ఉదయం 11: 07 గంటలకు రివీల్ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిజానికి ఈ మూవీ గురించి పెద్దగా హింట్ ఏమీ ఇవ్వలేదు. దీంతో ఇంతకీ ఎస్విసి 59 అప్డేట్ ఏమై ఉంటుందా ? అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి అప్డేట్ వచ్చేసింది.

విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబో రిపీట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు తన బ్యానర్ లో 59వ సినిమాను తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ను ఊరించి ఊరించి ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఒక రూరల్ యాక్షన్ డ్రామా, విజయ్ దేవరకొండ అభిమానులకు మాస్ ఫీస్ట్ గా ఉండబోతోందని వెల్లడించారు. మే 9న మిగతా వివరాలను రివీల్ తెలిపారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

దిల్ రాజుకు బ్యాడ్ టైమ్

దిల్ రాజు గతంలో నిర్మించిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అక్కినేని నాగచైతన్యతో కలిసి థాంక్యూ అనే మూవీని తెరకెక్కించారు దిల్ రాజు. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వచ్చిందో కూడా జనాలకు తెలియదు. అ తరువాత విజయ్ తో వారసుడు అనే మూవీ చేసి ఓ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆయన. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అనుకున్నారంతా. కానీ మూవీ ఫస్ట్ షో నుంచే తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అ నెగెటివిటీ ఎఫెక్ట్ ను తగ్గించడానికి దిల్ రాజు స్వయంగా పట్టుకొని థియేటర్ల దగ్గర నిలబడి ఆడియన్స్ దగ్గర ఒపీనియన్ తీసుకున్నప్పటికీ వేస్ట్ అయ్యింది. దాదాపు 50 కోట్లతో నిర్మించిన ఈ మూవీ కనీసం అందులో సగం కూడా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. పరుశురామ్ దర్శకత్వంపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇటు దిల్ రాజు, అటు విజయ్ దేవరకొండను ఈ మూవీ రిజల్ట్ తీవ్రంగా నిరాశపరిచింది. ఏప్రిల్ 5 లాంటి మంచి రిలీజ్ డేట్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ స్టార్ కంటెంట్ బాగా లేకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు దిల్ రాజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే శతమానం భవతి సీక్వెల్ ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రౌడీ హీరోతో మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. మరి ఈసారైనా వీరిద్దరి కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు