సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకు జ్ఞాపకాలను తవ్వి మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన ఓ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో రవితేజ ఒకరు. ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు రవితేజ. మూడు దశాబ్దాలుగా నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ కొనసాగుతున్నారు.
1968 జనవరి 26న ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేటలో జన్మించారు రవితేజ. ఈయన పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు. అభిమానులు ముద్దుగా “మాస్ మహారాజా” అని పిలుచుకుంటారు. 1990లో కర్తవ్యం అనే సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఈయనకి గుర్తింపు ఉన్న పాత్రలలో అవకాశాలు దక్కలేదు. దీంతో 1996లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలోనే వచ్చిన సింధూరం సినిమాలో సెకండ్ హీరో పాత్రలో నటించి.. 1999లో నీకోసం అనే సినిమాతో పూర్తి స్థాయిలో హీరోగా మారారు.
ఈ చిత్రానికి గాను రవితేజకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత రవితేజ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అద్భుతమైన సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే రవితేజ మొదటి నుండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎదుటివారు ఎంత పెద్దవారైనా సరే ఆయన నిర్మొహమాటంగా తప్పు చేస్తే తప్పు అని చెప్పేస్తారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఓ స్టార్ హీరో చేయవలసిన సినిమాలు అన్నీ రవితేజ వద్దకు వచ్చేసాయట. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవితేజ ఆ హీరో పై పరోక్షంగా స్పందించారట. ఎవరూ నన్ను ఏం చేయలేరు అన్న రేంజ్ లో అప్పట్లో ఘాటుగా ఆ హీరోకి బదులిచ్చారట రవితేజ. దీంతో ఈ వ్యాఖ్యలపై హర్ట్ అయిన ఆ స్టార్ హీరో రవితేజని చంపేయడానికి ఇంటికి గన్ తీసుకుని వెళ్లాడన్న న్యూస్ అప్పట్లో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సుపారి కూడా ఇచ్చారట. అయితే కొందరు ఈ న్యూస్ అంతా అబద్ధం అంటుంటే.. మరికొందరు మాత్రం ఆ హీరోది అలాంటి క్యారెక్టరే అని చెప్పుకొస్తున్నారు.