Pushpa The Rule : పుష్ప మేకర్స్ కి భారీ ఆఫర్.. కానీ రిస్కేమో?

Pushpa The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ గా విడుదలైన ‘పుష్ప ది రూల్’ టీజర్‌ భారీ హైప్ తో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక టీజర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దిశగా పరుగులు తీస్తుంది. విడుదలైన గంటల్లోనే మిలియన్ల కోద్దీ వ్యూస్, లక్షల్లో లైక్స్ రాబట్టాడు. ఫ్యాన్స్ అయితే పుష్పరాజ్ మాస్ జాతరకు ఫిదా అవుతున్నారు. అన్నిటికి మించి అల్లు అర్జున్ లుక్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేట్టుగానే ఉంది. అయితే ఇక పుష్ప 2 కి సంబంధించి ఇప్పట్నుంచే బిజినెస్ పనులు మొదలయ్యాయని తెలుస్తుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు డిస్ట్రిబ్యూటర్ లు పుష్ప కోసం కాచుకుని కూర్చున్నారు. ఇప్పటికే పలు ఏరియాల్లో కొన్ని బిజినెస్ డీల్ కూడా అయిపొయింది. ఇక రానున్న రోజుల్లో పుష్ప క్రేజ్ ని బట్టి బిజినెస్ ని కూడా మరింత పెంచే ఛాన్స్ ఉంది. ఇక తాజాగా పుష్ప నైజాం ఏరియా గురించి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మైత్రికి నైజాంలో భారీ ఆఫర్..?

ఆగష్టు లో రిలీజ్ కాబోతున్న పుష్ప ది రూల్ (Pushpa The Rule) కి ఇప్పటినుండే బిజినెస్ చర్చ మొదలవగా, తాజాగా పుష్ప కోసం మైత్రి నిర్మాతలకు నైజాం ఏరియా నుండి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. నైజాం ఏరియా కు సంబంధించి ఓ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ 100 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారట. అంటే నైజాం ఒక్క ఏరియా కె వంద కోట్లు అని తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద ఆఫర్ అంటే టాలీవుడ్ లో బహుశా అయితే దిల్ రాజు, లేదా అల్లు అరవింద్ అయి ఉంటారు అని భావిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ వల్ల దిల్ రాజు రిస్క్ చేసే ఛాన్స్ కూడా లేదన్న వాదన ఉంది. ఇక అల్లు అరవింద్ కొడుకు సినిమా కాబట్టి ఇంత సాహసం చేయొచ్చని అంటున్నారు నెటిజన్లు. అయితే నైజాం ఏరియాకు 100 కోట్ల ఆఫర్ అంటే రిస్క్ అనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ వసూళ్లే వంద కోట్లు. అలాంటిది వంద కోట్లు అంటే అటు ఇటు అయితే బయ్యర్లకు భారీ దెబ్బ పడుతుంది. సినిమాపై ఎంత నమ్మకమున్నా ఇంత పెద్ద రిస్క్ కరెక్ట్ కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

మైత్రి నిర్మాతల ప్లాన్ మాత్రం ఇలా ఉందట?

అయితే టాలీవుడ్ లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న పుష్ప ది రూల్ బిజినెస్ పరంగా కొత్త రికార్డులు సృష్టించేలానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 250 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మైత్రి నిర్మాతల ప్లానింగ్ మాత్రం వేరేలా ఉందని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా భారీగా విడుదల చేయనున్న మేకర్స్, తెలుగు రాష్టాల్లో మాత్రం మేజర్ ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం రిలీజ్ వరకూ బాగానే ఉన్నా, అన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ అంటే రిలీజ్ సమయంలో థియేటర్ల సమస్య రావొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు