Mythri Movie Makers: ఆల్ టైం రికార్డులపై కన్నేసిన పుష్ప.. అందుకే ఆరోజు?

Mythri Movie Makers:

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీల్లో ఒకటి పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ కి రెండో భాగం గా వస్తున్న ఈ సినిమాపై ఒక్క తెలుగులోనే కాదు ఇండియా అంతటా భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా హిందీలో పుష్ప రాజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. పైగా అప్పట్లో నార్త్ లో పుష్ప సినిమా చిన్న చిన్న పల్లెటూళ్ళో కూడా పిచ్చిగా చూసారు జనాలు. అయితే 2021 లో రిలీజ్ అయిన పుష్ప నుండి రెండో భాగం రావడానికి చాలా టైం తీసుకుంటున్నాడు సుకుమార్.

దానికి అనేక కారణాలు ఉన్నా, ఫ్యాన్స్ చాలా లేట్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. మొన్నటివరకు 2024 సమ్మర్ లో రిలీజ్ అవుతానందనుకున్నా, లేటెస్ట్ గా చిత్ర యూనిట్ పుష్ప రిలీజ్ డేట్ ని ఏకంగా ఆగష్టు15 న వస్తుందని ప్రకటించే సరికి పుష్ప ఫ్యాన్స్ షాకయ్యారు. ఇంత లేటెందుకు అని అనుకున్నా, తాజాగా ఆ రిలీజ్ డేట్ ని ఎంచుకుకోవడం పై మేకర్స్ మాస్టర్ బ్రెయిన్ ని వాడారని తెలుస్తుంది.

ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం పైగా గురువారం, కాబట్టి ఆరోజు స్కూల్స్ తో సహా చాలా ఆఫీస్ లకు సెలవు ఉంటుంది కాబట్టి, పాన్ ఇండియా వ్యాప్తంగా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ పై కన్నేశారని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఎలాగూ వీకెండ్ వస్తుంది కాబట్టి, నాలుగు రోజుల కలెక్షన్లు తోడయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ గా జవాన్ నాలుగు రోజుల వీకెండ్ అడ్వాంటేజ్ తో ఏ రేంజ్ లో కుమ్మిందో తెలిసిందే. అందుకే లాంగ్ వీకెండ్ సెలవులతో కలెక్షన్లతో కుమ్మేయాలని మూవీ మేకర్స్ ప్లాన్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు