Gaanja Shankar : షూటింగ్ ఆగలేదు… కానీ పూజా ఔట్

యాక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. గత ఏడాది వేసవిలో “విరుపాక్ష” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి “బ్రో”తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. గత నాలుగు నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా “గాంజా శంకర్” అనే సినిమాను ప్రకటించారు. అయితే కొన్ని రోజుల క్రితం అది కూడా ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపోలేదు, కానీ హీరోయిన్ మారింది. 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “గాంజా శంకర్”. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ రూపొందిస్తున్నారు. సాయి ధరం తేజ్ కు ఇది 17వ సినిమా కాగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అయితే తేజ్ భారీగా పారితోషకం డిమాండ్ చేయడం వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని గత కొద్ది రోజులుగా రూమర్లు వైరల్ అవుతున్నాయి. అయితే తేజ్ మార్కెట్ ఇప్పుడు ఆయన పారితోషికం డిమాండ్ చేసే రేంజ్ లో లేకపోవడం, ఇటీవల కాలంలో తెలుగు సినిమాల నాన్ ధియేట్రికల్ మార్కెట్ కూడా పడిపోవడంతో, వాటిని దృష్టిలో పెట్టుకుని సితార ఎంటర్టైన్మెంట్స్ “గాంజా శంకర్” ప్రాజెక్టును ఆపేయాలని నిర్ణయించుకుందని అన్నారు. అయితే తాజాగా “గాంజా శంకర్” టైటిల్ ను మార్చాలంటూ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు చిత్ర బృందానికి నోటీసులు జారీ చేయడంతో మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఆగిపోయిన సినిమాకు నోటీసులు జారీ చేయడం ఏంటి అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. 

అయితే తాజా సమాచారం ప్రకారం “గాంజా శంకర్” మూవీ ఆగిపోలేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం మారిపోయిందని తెలుస్తోంది. ముందుగా ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజ హెగ్డేను హీరోయిన్ గా అనుకోగా, తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. ఇందులో హీరోయిన్ పాత్ర మిడిల్ ఏజ్, డీ గ్లామర్ రోల్ కావడంతో పాటు జైల్ లో ఉంటుందని సమాచారం. ఇప్పుడు పూజ ప్లేస్ ను ఇస్మార్ట్ బ్యూటీ నిధితో రీప్లేస్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ ను “గాంజా శంకర్”లో కూడా తీసుకోబోతున్నారని సమాచారం. “ఇస్మార్ట్ శంకర్” సినిమా తర్వాత ఈ అమ్మడికి చెప్పుకోదగ్గ హిట్ రానేలేదు. పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించినప్పటికీ వరుస డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక చివరగా “హరిహర వీరమల్లు” సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. కానీ ఆ సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిధికి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో “రాజా సాబ్” తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఈ నేపథ్యంలోనే “గాంజా శంకర్” సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారికంగా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు