Nayanthara: AK62 ఎఫెక్ట్ తో షాకింగ్ నిర్ణయం

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో జవాన్ చేస్తోంది. అలాగే జయం రవితో ఇరైవన్ అనే సినిమాలో నటిస్తుంది. కాగా నయనతార గతేడాది డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు ప్రేమలో ఉన్నప్పటి నుంచే ఇద్దరు కలిసి రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. అలాగే విఘ్నేష్ శివన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తుండగా, నయనతార హీరోయిన్ గా రాణిస్తోంది.

అయితే ఇటీవల అజిత్ తో విఘ్నేష్ శివన్ ఓ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. AK62 పేరుతో ఓ ప్రకటన కూడా వచ్చింది. దీన్ని లైకా ప్రొడక్షన్ నిర్మించడానికి ముందుకు వచ్చింది. అయితే అజిత్, లైకా కు విఘ్నేష్ శివన్ చెప్పిన స్టోరీ నచ్చలేదట. కొన్ని మార్పులు చేయాలని విఘ్నేష్ ను కోరారని సమాచారం. అయితే తాను కథలో ఎలాంటి మార్పులు చేయబోనని విఘ్నేష్ స్పష్టం చేశాడట. దీంతో తాను ఈ సినిమా చేయలేమని అజిత్, లైకా ప్రొడక్షన్ హౌస్ చెప్పారట. దీంతో విఘ్నేష్ శివాన్ తో అజిత్ చేయాల్సిన AK62 ఆగిపోయింది.

విఘ్నేష్ స్టోరీని అజిత్, లైకా ను ఒప్పించడానికి నయనతార రంగంలోకి దిగిందని సమాచారం. అయితే, నయనతార వెళ్లినా, ఆ స్టోరీని అజిత్, లైకా ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీంతో నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందట. తన భర్త స్టోరీని రిజక్ట్ చేసిన అజిత్ తో, లైకా తో ఇక సినిమాలు చేయబోనని నయనతార డిసైడ్ అయినట్టు కోలీవుడ్ వర్గాల్లో తెగ గుస గుసలు వినిపిస్తున్నాయి. తన భర్తను అవమానించారని నయనతార్ ఫీల్ అయిందని టాక్. అయితే ఈ వార్తలపై ఇటు అజిత్ గానీ, లైకా వారు గానీ.. అటు నయనతార, విఘ్నేష్ శివన్ గానీ స్పందించలేదు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు