Thandel: బడ్జెట్ లిమిట్ దాటింది? అందుకే పాన్ ఇండియా ప్లానింగ్..!

టాలీవుడ్ లో ఈ ఇయర్ తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో నాగ చైతన్య నటిస్తున్న “తండేల్” కూడా ఒకటి. నాగ చైతన్య మీడియం రేంజ్ హీరో అయినప్పటికీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు ఆలు అరవింద్. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ తరువాత ఈ కాంబో లో మళ్ళీ సినిమా వస్తుండడం వల్ల మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి హై ఇంపాక్ట్ ని ఇచ్చింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అవగా, ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాని నిర్మిస్తున్న బన్నీ వాసు మూవీ బడ్జెట్ పై లెక్కలు వేయగా, ఇప్పటికే బడ్జెట్ పరిధి దాటిపోయిందట. అయితే సినిమా టీజర్ రెస్పాన్స్ చూసాక తండేల్ ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. దీనికి అల్లు అరవింద్ కూడా అంగీకరించాడని టాక్. అయితే పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేసినా బడ్జెట్ తో సహా అన్ని ఖర్చులు కలిపి 80 కోట్లు దాటకూడదని అల్లు అరవింద్ అన్నట్టు సమాచారం.

అయితే ఈరోజుల్లో పాన్ ఇండియా మూవీ అంటే మినిమం వంద కోట్లు దాటడం ఖాయం. మరి ఎనభై లోపే అంటే అది డైరెక్టర్ పనితనం పై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా తండేల్ మూవీ లో పాన్ ఇండియా స్టఫ్ ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి మూవీ మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో, ఎంత వరకు తండేల్ ని పాన్ ఇండియా వరకు రీచ్ అయ్యేలా చేస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు