IT Raids: మళ్ళీ ఐటీ రైడ్స్..”టైగర్ నాగేశ్వరరావు” రిలీజ్ కి బ్రేక్

టాలీవుడ్ లో దసరా కి రాబోతున్న క్రేజీ సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు కూడా ఒకటి. ఈ సినిమాలో మాస్ మహారాజ్ హీరోగా నటించగా, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రూపొందగా, భారీ తారాగణం ఇందులో నటించారు.

అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో తాజాగా ‘ఐటీ’ మరియు ‘జిఎస్ టి’ సంస్థలు సోదాలు చేస్తున్న వార్త బ్రేకింగ్ గా మారింది. హైదరాబాద్ లో ఉన్న అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్ కి చెందిన అభిషేక్ పిక్చర్స్ ఆర్ట్స్ ఆఫీస్ లో సడన్ గా రైడ్ జరగడం మాత్రం వైరల్ గా మారింది. ఈ రైడ్ పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక వీరి బ్యానర్ లో వచ్చిన కార్తికేయ2 130 కోట్లు వసూలు చేయగా, కాశ్మీర్ ఫైల్స్ 350 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 20న రిలీజ్ అవుతుంది.

- Advertisement -

అయితే గతంలో పుష్ప 2 టీజర్ వచ్చిన సమయంలో మూడు నెలల కిందట మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించిన ఆఫీస్ లో, అలాగే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీసిన టైం లో దిల్ రాజు ఆఫీస్ లో కూడా ఐటీ సంస్థలు రైడ్ చేసిన విషయం తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు