Double Ismart : తుది దశకు చేరుకున్న రామ్ సినిమా!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఒకటి. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబో లో వస్తున్న ఈ సినిమాపై పేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. దానికి కారణం ఇస్మార్ట్ శంకర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. లాక్ డౌన్ ముందు అన్ సీజన్లో రిలీజ్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి ప్లాపుల్లో ఉన్న రామ్ కి అలాగే పూరి జగన్నాథ్ కి ఊర మాస్ కం బ్యాక్ ఇచ్చింది. అప్పట్లోనే 40 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. నిజానికి ఇప్పుడు మళ్ళీ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ మళ్ళీ ప్లాప్స్ తో సతమతమయ్యారు. వీళ్ళ గత సినిమాలు డిజాస్టర్లు అవగా ఇద్దరికీ హిట్టు కావాల్సిన పరిస్థితి. అందుకే వీళ్ళ ఆశలన్నీ సీక్వెల్ గా చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై పడ్డాయి. ఆల్మోస్ట్ పాత కాంబోనే రిపీట్ చేస్తూ సీక్వెల్ ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ కోసం అదే కాంబో?

ఇక పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి కూడా గత సినిమాకి పని చేసిన మేకర్స్ పనిచేస్తుండడం విశేషం. నిర్మాతగా పూరి జగన్నాథ్, ఛార్మి మరోసారి కలిసి పనిచేస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ మళ్ళీ కొనసాగుతున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ గా కూడా ఇస్మార్ట్ శంకర్ లో నటించిన నిధి అగర్వాల్ ని రిపీట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే క్రమంలో ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలి. ఇక డబుల్ ఇస్మార్ట్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. అంతే కాదు పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా నటిస్తున్నారని సమాచారం. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని అప్డేట్ వచ్చింది.

క్లైమాక్సే మిగిలింది ?

గత పది నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సినిమా స్టార్ట్ చేయడంతోనే యాక్షన్ సీన్లతో షూటింగ్ చేసిన పూరి ఇప్పుడు కూడా యాక్షన్ ఎపిసోడ్ తోనే పూర్తి చేయనున్నాడట. ఈ సినిమాలో ఇక రెండు పాటలు పది రోజుల షూటింగ్ వర్క్ మాత్రమే మిగిలి వుందని సమాచారం. అంటే దాదాపు తొంభై శాతం సినిమా పూర్తయిపోయిన్నట్టే లెక్క. ఇక క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి సంబంధించి ఇంటర్వెల్ ఫైట్, క్లయిమాక్స్ ఫైట్, రెండు పాటలు మినహా మిగిలిన సినిమా అంతా పూర్తయిందట. ఇది కూడా పూర్తయితే సినిమా టెక్నికల్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉటుంది. ఇక పూరి జగన్నాథ్ తన సినిమా టెక్నికల్ వర్క్ విషయంలో పెద్దగా టైం తీసుకోడని తెలిసిందే. త్వరలోనే ఆ పనులు కూడా ఫినిష్ చేసి, ఒక స్ట్రాంగ్ టీజర్ రిలీజ్ చేసి దాంతో ఇక సినిమా ప్రమోషన్ల పై ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. నిజానికి డబుల్ ఇస్మార్ట్ మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో లేట్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఫైనల్ గా జూన్ 14న ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు