RAPO: పూరి ఆశలన్నీ రామ్ పైనే – డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ కు రెడీ !

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ట్ హీరోలుగా చెలామణిలో ఉన్న అందరి కెరీర్ లను మార్చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ ప్రస్తుతం గందరగోళంగా ఉంది. పూరి తో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న స్టార్ హీరో అయిపోయినట్టే అని అనుకునే హీరోలంతా ప్రస్తుతం పూరితో పని చేయడానికి ఏ హీరో సిద్ధంగా లేదు, కారణం ఆయన గత కొద్దీ కాలంగా తీస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతుండటమే..

2015 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమా తరువాత నుంచి పూరి జగన్నాథ్ కెరీర్ లో మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదని చెప్పాలి. అప్పటిదాకా ఫ్లాప్ లలో ఉన్న ఎన్టీఆర్ కు టెంపర్ సినిమా హిట్ ఇవ్వగా, పూరి కి మాత్రం అదే లాస్ట్ హిట్ అయిపొయింది. ఆ సినిమా తరువాత దాదాపు 4 ఏళ్ళు ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో స్టార్ హీరోలెవరు పూరి పని చేయడానికి ఆసక్తి చూపించలేదు. అప్పుడే పూరి జగన్నాథ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే మాస్ సినిమా తీసి, బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు.

ప్రస్తుతం ఈ సక్సెస్ కాంబోనే మళ్ళీ రిపీట్ అవబోతుంది. గతేడాది పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో పూరి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేసాడు. ఛార్మి ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ స్కెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మహా శివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నాం అంటూ ప్రకటించగా, ఈ రోజు ఈ మూవీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. జులై 12 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుంది. పూరి ఆశలన్నీప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైనే ఉండగా ఈ సినిమా హిట్ పూరికి కీలకంగా మారనుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు