Boney Kapoor : శ్రీదేవి బయోపిక్ పై బోణీ షాకింగ్ కామెంట్స్..!

Boney Kapoor : శ్రీదేవి ఈ పేరు ఒక సంచలనంగా మారింది.. సౌత్ టు నార్త్ తన అంద చందాలతో దుమ్ము దులిపేసిన హీరోయిన్ గా పేరు సంపాదించింది శ్రీదేవి.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది శ్రీదేవి.. అలాంటి శ్రీదేవి బాలీవుడ్లో అగ్ర నిర్మాతగా పేరు పొందిన బోణీ కపూర్ ను ప్రేమించి మరీ రెండవ వివాహం చేసుకుంది.. వివాహం కంటే ముందే ఒక కూతురుకు జన్మనిచ్చిన ఈమె వివాహం తర్వాత మరో కూతురుకి జన్మనిచ్చింది.. ఇక ప్రస్తుతం శ్రీదేవి కూతురు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్స్ గా చలామణి అవుతున్నారు. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా శ్రీదేవి బయోపిక్ వస్తుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.. తాజాగా శ్రీదేవి భర్త ఈ విషయంపైన మాట్లాడుతూ.. తాను బ్రతికి ఉన్నంతవరకు తన భార్య బయోపిక్ ను తెరకెక్కించడానికి ఒప్పుకోనంటూ బోణీ కపూర్ తెలియజేశారు.

శ్రీదేవి బయోపిక్ పై బోణీ కామెంట్స్ వైరల్..

ఇటీవల అజయ్ దేవగన్ కథానాయకుడుగా నిర్మించిన మైదాన్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బోణీ కపూర్, శ్రీదేవి బయోపిక్ పైన పలు విషయాలను తెలియజేశారు.. తన భార్య వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇస్తుందని.. తన పర్సనల్ విషయాలు బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం లేదని అనుకునేదంటూ తెలిపారు.. ముఖ్యంగా తన భార్య వ్యక్తిత్వాన్ని తాను ఎంతో గౌరవిస్తానని.. బయోపిక్ సినిమా అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంటుంది కనుక తన భార్య కోరిక మేరకే ఆమె బయోపిక్ తీయడానికి తాను ఒప్పుకోనంటూ తెలిపారు.

నేను బ్రతికున్నంత వరకు అది జరగదు..

బోణీ కపూర్ మాట్లాడుతూ.. నేను బ్రతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ ని ఎవరు తీయలేరు అంటూ బోణీ కపూర్ వెల్లడించారు.. ఆరేళ్ల క్రితం దుబాయిలో ఎవరు ఊహించని విధంగా..అనుమానాస్పద స్థితిలో మరణించారు శ్రీదేవి.. దీంతో ఎలాగైనా ఆమె బయోపిక్ తీయాలని.. గత కొంతకాలంగా బాలీవుడ్ లో చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇలాంటి సమయంలోనే బోనికపూర్ ( Boney Kapoor ) చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. ముఖ్యంగా శ్రీదేవి మరణం పైన ఇప్పటికీ ఎంతోమందికి పలు రకాల అనుమానాలు ఉన్నాయి.. అయితే ఈమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

- Advertisement -

శ్రీదేవి మరణం పై పోలీసులు ఏం చెప్పారంటే..

శ్రీదేవి మరణించే సమయంలో దుబాయ్ పోలీసులు చెప్పిన విషయం ఏమిటంటే.. శ్రీదేవి మద్యం సేవించి ఉందని.. అందుకే గుండెపోటుతో మరణించింది అంటూ ఫారెన్సిక్ నిపుణులు తెలియజేసారు.. అయితే నీళ్లలో పడి మరణించింది అనే విషయాన్ని మాత్రం చెప్పలేక పోయారు.. కానీ ప్రమాదవశాత్తు ఆమె బాత్ టబ్ లో పడి మరణించింది అని చెప్పేశారు.. ఇలా శ్రీదేవి మరణం పైన ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ.. శ్రీదేవి ఒక ప్రకృతి శక్తి ..ఆమె అందం ఒక అద్భుతం.. ఆమె నటన అంటే ఎంతో మంది అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు 300కు పైగా సినిమాలలో నటించిన ఈమె చివరిగా 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో నటించి.. ఈ సినిమాతో మంచి ప్రశంసలు అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు