Suhas : అయోధ్య ప్రారంభోత్సవం రోజు ఈ హీరో ఇంట్లో డబుల్ సెలెబ్రేషన్స్..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడైన సుహాస్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా షార్ట్ ఫిల్మ్ లతో ఫేమస్ అయి, సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ, కలర్ ఫోటో సినిమాతో హీరోగా పాపులర్ అయిన నటుడు “సుహాస్”. టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు ఇతను. వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన క్యారెక్టర్ ను వదులుకోకుండా ఏ పాత్రనైనా చేస్తూ నటుడిగా ముందుకెళ్తున్న సుహాస్ హీరోగా వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం “అంబాజీ పేట మ్యారేజి బ్యాండు” సినిమాలో సుహాస్ హీరోగా నటించగా, ఆ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ హీరో కి 2024 గోల్డెన్ ఇయర్ కాబోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం మొత్తం చాలా ప్రత్యేకంగా భావించిన అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన నిన్న జరిగింది. అదే రోజున సుహాస్ ఇంట్లో మరింత ఆనందాన్ని తెస్తూ ఈ హీరోకు కొడుకు పుట్టడం జరిగింది. ఈ విషయాన్నీ సుహాస్ స్నేహితుడు డైరెక్టర్ అయిన సందీప్ రాజ్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ శుభాకాంక్షలు తెలియచేసాడు.

అయితే ఈ రామ మందిర ప్రారంభోత్సవం రోజు సుహాస్ ఇంట్లో డబల్ సెలెబ్రేషన్స్ జరగడం ఆనందదాయకం అని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫిబ్రవరి 2న రిలీజ్ అయ్యే అంబాజీపేట మ్యారేజి బ్యాండు తో సుహాస్ ఆనందం రెట్టింపు అవుతుందని అంటున్నారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు