Suhas: నాటి కష్టమే నేటి ఎదుగుదలకు దోహదపడుతుంది

ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా షార్ట్ ఫిల్మ్ లతో ఫేమస్ అయి, సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ, కలర్ ఫోటో సినిమాతో హీరోగా పాపులర్ అయిన నటుడు “సుహాస్”. టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు ఇతను. వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన క్యారెక్టర్ ను వదులుకోకుండా ఏ పాత్రనైనా చేస్తూ నటుడిగా ముందుకెళ్తున్న సుహాస్ హీరోగా వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు.

రీసెంట్ గా రైటర్ పద్మభూషణ్ అంటూ మరో సినిమాలో నటించాడు సుహాస్. ఛాయ్ బిస్కెట్స్ అనురాగ్, శరత్ కలిసి నిర్మించిన ఈ సినిమాను షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసాడు. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా డీసెంట్ విజయాన్నందుకుంది. ప్రస్తుతం “అంబాజీ పేట మ్యారేజి బ్యాండు” సినిమాలో హీరోగా నటిస్తున్న సుహాస్ తాజాగా మరో సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

రాధవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకటేశ్వర్ బల్మరి నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలో సుహాస్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. “శ్రీ రంగ నీతులు” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రవీణ్ కుమార్ విఎస్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇతనికి ఇదే మొదటి సినిమా. కంచర పాలెం ఫేమ్ కార్తీక్ రత్నం ఇందులో సహ నటుడిగా నటిస్తుండగా రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్ల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియచేసారు. ఏది ఏమైనా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని అన్ని రకాల పాత్రల్ని చేస్తున్న సుహాస్ ఇండస్ట్రీ లో సౌమ్యుడిగా మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు హీరోగా చేస్తున్న “అంబాజీ పేట మ్యారేజి బ్యాండు”, “శ్రీ రంగ నీతులు” చిత్రం హిట్ అయితే తన కెరీర్ కి మంచి బూస్టప్ దొరికినట్టే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు