Agent: పుష్ప 2 లో ఊర్వశి ఐటమ్ సాంగ్.. ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్ పాన్ ఇండియన్ హిట్ మూవీ ‘పుష్ప : ది రైజ్’. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అలాగే ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు ‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా’ అంటూ ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. సినిమా విడుదలకు ముందే ఈ సాంగ్ దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. తన అందంతో పాటకి కొత్త ఊపు తీసుకొచ్చింది సమంత.

అయితే పుష్ప పార్ట్ 2 లో కూడా హీరోయిన్ సమంతనే ఐటెం సాంగ్ చేయనున్నట్లు మొదటి వరకు వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఇందులో నిజం లేదని ఆ తర్వాత అందరూ అనుకున్నారు. ఇది ఇలా ఉండగా… తాజాగా పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పుష్ప 2 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల ఐటెం సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో ఏకంగా మూడు నిమిషాల పాటు ఈ ఐటెం సాంగ్ ఉండనుందట. ఈ మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఈ బాలీవుడ్ బ్యూటీ ఊర్వసి ఏకంగా మూడు కోట్లు వసూలు చేయనుందట. ఈ మేరకు ఇప్పటికే అన్ని చర్చలు జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు