Kalabhavan mani: పేరుకే స్టార్ నటుడు… నిజజీవితంలో అన్నీ కష్టాలే..!

తెలుగు ప్రేక్షకులకు నటుడు కళాభవన్ మణి బాగా సుపరిచితమే.. ఈయన ఎన్నో చిత్రాలలో తన విలనిజంతో అందరినీ భయపెట్టారు.. వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో కూడా ప్రతి కథానాయకుడుగా నటించారు.. అలాగే నగరం, ఆయుధం, అర్జున్ , నరసింహుడు తదితర తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించారు కళాభవన్ మణి. నటుడు గానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా కూడా బాగానే పేరు సంపాదించారు.. మలయాళ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడు కూడా ఈయనే..

కళాభవన్ మణి తమిళ నటుడు కామెంట్స్..
అయితే ఈయన మరణం దక్షణాది సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది.. అంతేకాదు ఈయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కి , మద్యానికి కూడా బానిసవ్వడంతో కళాభవన్ మణి అనారోగ్య సమస్యలతో మరణించారు.. ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో తమిళ్ నటుడు సురేష్ గోపీ మాట్లాడుతూ.. కళాభవన్ మణి తో తనకున్నటువంటి జ్ఞాపకాలను సైతం గుర్తు చేసుకున్నారు.. సురేష్ గోపీ మాట్లాడుతూ మణి పై ఎప్పటికీ తన ప్రేమ మారదని.. అతనితో తాను గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని.. ప్రత్యేకించి రెండు విషయాలు మరణించేవరకు తన మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అంటూ వివరించారు.

అన్నీ ఉన్న నిరాడంబరంగానే..
ఇకపోతే అరేబియన్ డ్రీమ్స్ షో కోసం దుబాయ్ కి వెళ్ళాము.. నా గది పెద్దగా ఉండేది.. నా స్నేహితులందరితో పాటు కళాభవన్ మణి కూడా నేలపై మాత్రమే నిద్రపోయారు.. అంత పెద్ద నటుడు అయ్యుండి కూడా అలా నేల పైన పడుకోవడం అది ఆయన గొప్పతనం.. ఆ విషయం ఇప్పటికీ నాకు జ్ఞాపకం గానే ఉంది. అలాగే నేను కళాభవన్ మణి పెళ్లికి వెళ్లాను.. అప్పుడు కూడా నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకొని కౌగిలించుకొని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.. తన వివాహానికి ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కూడా రాలేదంటూ ఏడ్చారు అంటూ తెలిపారు గోపీ.

- Advertisement -

రక్తం కక్కుకొని మరణించారు..
కళాభవాని మణి మొదటిసారి నా సినిమాకు ఆటోలో వచ్చారు.. తనతో పాటు ఉన్న వ్యక్తి నేనే.. ఆయన అక్షరం అనే సినిమాలో మొదటిసారిగా నటించారు.. తనతో ఉన్న క్షణాలు ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటాయంటూ ఎమోషనల్ గా మాట్లాడారు సురేష్ గోపి.. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించిన మణి 2016 వ సంవత్సరంలో అనారోగ్య సమస్య వల్ల రక్తం కక్కుకొని మరణించారు.. అయితే ఇదంతా కేవలం అతడు అతిగా మద్యం సేవించడం వల్లే జరిగిందని అందరూ అనుకున్నారు.. కానీ ఫోరెన్సిక్ టెస్ట్ లో పురుగుల మందు తాగిన ఆనవాళ్లు కనిపించడంతో.. మణి మరణం పైన అనేక సందేహాలు ఉన్నాయి. చివరిసారిగా ఈ నటుడు ఎవడైతే నాకేంటి అనే సినిమాలో తెలుగులో కనిపించారు. అయితే అందరూ ఉండి కూడా ఒంటరి వాడిగా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరం అంటూ గోపీ వెల్లడించారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు