Chiranjeevi : మొన్న వంగ.. నిన్న గురూజీ.. నేడు అనిల్.. ఎవరికీ వారు ఊహించుకుంటున్నారు..!

భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారత ప్రభుత్వం టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కి భారత రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు మొదలు కొని ఇతర భాషల స్టార్స్ సెలెబ్రిటీలు ఆయన్ని రెండు రోజుల నుండి విష్ చేస్తూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ దర్శకులు కలుస్తూ మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా విష్ చేయడం జరిగింది. నిన్నటి తరం ఫేడ్ అవుట్ అయిన స్టార్ డైరెక్టర్స్ , వివి వినాయక్, గుణశేఖర్ నుండి, ఇప్పటి అప్ కమింగ్ స్టార్ డైరెక్టర్లు ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి విష్ చేయడం జరిగింది.

అయితే తాజాగా ఈ స్టార్ డైరెక్టర్లు అందరూ చిరును అభినందిస్తూనే, వాళ్ళలో కొందరు చిరుకి కథ వినిపించేందుకే కలిసారని రాయడం మొదలెట్టారు. మొన్న సందీప్ రెడ్డి వంగ కలిసినపుడు, వంగ తన ఫేవరేట్ హీరోని కలిసాడు, ఈ క్రమంలోనే కథని ఒకే చేయిస్తున్నాడు, ఈ కాంబో లో మూవీ గ్యారెంటీ అని రచ్చ చేసారు. ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చిరంజీవిని కలవడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్. త్రివిక్రమ్ చేయబోయే అందరి సినిమాలు ఆపి మెగాస్టార్ చిరంజీవితో కథ ఒకే చేయించుకున్నాడని సమ్మర్ లో వీరి కాంబో మొదలవుతుందని కథలు అల్లడం మొదలెట్టారు.

ఇప్పుడు లేటెస్ట్ గా అనిల్ రావిపూడి చిరుని కలవడం జరిగింది. ఈ సందర్బంగా మళ్ళీ సోషల్ మీడియా లో వార్తలలు మొదలయ్యాయి. చిరుతో అనిల్ ఓ మంచి కామెడీ సినిమా తీస్తున్నాడని, అందుకే కలవడం జరిగిందని వార్తలు మొదలయ్యాయి. అసలు లెక్కకొస్తే చిరు వీళ్లెవరితోనూ సినిమా తీయట్లేదన్నది వాస్తవం. ఒకవేళ ఎవరైనా దర్శకుడు చెప్పే కథ నచ్చినా దాన్ని విశ్వంభర రిలీజ్ అయ్యాకే మొదలు పెడతాడని చిరు సన్నిహిత వర్గాల సమాచారం.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు