Chiranjeevi: ఇదేమి కష్టం విశ్వంభర… ముగ్గురు హీరోయిన్ల కోసం ముల్లోకాలు తిరిగినా ఫలితం లేదే!

మెగా స్టార్ చిరంజీవి… “విశ్వంభర” సినిమాలో ముల్లోకాలను తిరుగుతున్నాడో లేదో తెలిదు.కానీ, ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్స్ కోసం అయితే.. ముల్లోకాలను చూట్టేస్తున్నాడు..ఈ సినిమాకు హీరోయిన్లను సెట్ చేయడం “విశ్వంభర” మేకర్స్ కు కష్టంగా మారింది. దీంతో ఇదేమి కష్టం విశ్వంభర… ముగ్గురు హీరోయిన్ల కోసం ముల్లోకాలు తిరిగినా ఫలితం లేదే అంటున్నారు నెటిజన్లు. ‘బింబిసారా’ ఫిలిం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఫాంటసీ మూవీ “విశ్వంభర” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముల్లోకాల చుట్టూ తిరుగుతుందని, కానీ మూవీలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ మూవీలో త్రిషను ఒక హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తోంది.

నిజానికి ముందుగా ఆ పాత్ర కోసం అనుష్క శెట్టిని సంప్రదించారు మేకర్స్. కారణం ఏంటో తెలియదు కానీ అనుష్క ఆ రోల్ ను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. దీంతో త్రిషను అప్రోచ్ అయ్యారట “విశ్వంభర” మేకర్స్. త్రిష ఓకే చెప్పడంతో మొత్తానికి ఒక హీరోయిన్ ఫైనల్ అయింది. ఆ తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తున్న మృణాల్ ఠాకూర్ ను మరో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈ ఇద్దరు హీరోయిన్లను మాత్రం ఎలాగోలా కష్టపడి సెట్ చేశారు. కానీ సినిమాకు మరో ముగ్గురు హీరోయిన్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో “విశ్వంభర” టీం హీరోయిన్ల వేటలో పడ్డారట. అందులో భాగంగానే సీనియర్ హీరోయిన్లు తమన్నా, పూజా హెగ్డే, రాశి కన్నా వంటి వారిని సినిమాలోకి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారట. మరో యంగ్ హీరోయిన్ రీతు వర్మతో కూడా చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రీతు వర్మ మెగా కాంపౌండ్ లోకి కోడలుగా అడుగు పెట్టబోతోంది అని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఒకవేళ రితూ వర్మ గనుక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కనిపిస్తే సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.

మరి వీరందరిలో ఆ మరో ముగ్గురు హీరోయిన్లుగా ఎవరు ఫిక్స్ అవుతారు అనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఆ ముగ్గురు హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుని, “విశ్వంభర” టీం నుంచి అధికారికంగా వారి పేర్లను ప్రకటించనున్నారు నిర్మాతలు. ఇక “విశ్వంభర” సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. చిరంజీవికి ఇది 156 సినిమా కాగా, మూడు ప్రపంచాల ఆధారంగా హై బడ్జెట్ ఫాంటసీ మూవీగా “విశ్వంభర” తెరకెక్కుతోంది. మొదటిది భూలోకం, రెండవది దేవలోకం, మూడవది పాతాళ లోకం… ఈ మూడు లోకాల చుట్టూ మూవీ తిరుగుతుందని చెబుతున్నారు. 200 నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ వంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో భారీ డిజాస్టర్ లను చవిచూసిన మెగాస్టార్ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రానా ఈ మూవీలో విలన్ గా నటిస్తుండగా, కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు