Prashant Neel: కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ లో ఏ రేంజ్ పాపులారిటీ ఉందో మన అందరికీ తెలిసిందే. రాజమౌళి తర్వాత అంతటి పాపులారిటీ దక్కించుకున్న ఏకైక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ 3, సలార్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలు ప్రభాస్ మరియు యష్ కెరీర్లో కూడా బిగ్గెస్ట్ గ్రోసరుగా నిలిచాయి. తాజాగా ఈ సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే సలార్ 2 నీ తాను డైరెక్ట్ చేయబోతున్నట్లు కన్ఫామ్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇక కేజిఎఫ్ 3 పై కూడా మాట్లాడుతూ..” దానికి స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయిపోయింది.
కాకపోతే ఇప్పుడు యష్ కి ఉన్న కమిట్మెంట్స్ అలాగే ప్రొడ్యూసర్ విజయ్ కి ఉన్న కమిట్మెంట్స్ తో ఇంకా సినిమా చేయడానికి కాస్త సమయం పడుతుంది. కచ్చితంగా చాప్టర్ 3 ఉంది. మళ్లీ సలార్ నుంచి కేజిఎఫ్ లోకి రావడానికి నేను కొంచెం బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సలార్ పార్ట్ 2 అనంతరం కొద్దిగా గ్యాప్ తీసుకుని అనంతరం ఈ చాప్టర్ 3 ని స్టార్ట్ చేస్తాము ” అంటూ అదిరిపోయే అప్డేట్ ను రిలీజ్ చేశాడు ప్రశాంత్ నీల్.