ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొంతమంది హీరోలు లేదా హీరోయిన్లు వచ్చిన ఛాన్సులు వినియోగించుకొని సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం బంపర్ ఆఫర్ లాంటి సినిమాలు వస్తే రిజెక్ట్ చేసి బాధపడుతూ ఉంటారు. అలా ఒక హీరోకు వచ్చిన సినిమాలు మరొక హీరో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు వచ్చిన సినిమాలన్నీ రవితేజ చేసి స్టార్ హీరోగా మారిపోయాడు.
అచ్చం అలాగే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి మంచి సినిమాలను కోల్పోయారు. దానివల్ల ఇతర హీరోలు ఆ సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత స్టార్ హీరోలుగా మారిపోయారు. అయితే… ఇప్పుడు రోబో సినిమాను కూడా కొంతమంది స్టార్లు వదులుకున్నారట. వదులుకున్నారా లేదా ఏదైనా సమస్యలు వచ్చాయో తెలియదు కానీ మొత్తానికి రోబో సినిమాను ప్రీతిజింటా మరియు కమలహాసన్ మిస్ చేసుకున్నారట.
రజినీకాంత్ మరియు ఐశ్వర్య రాయి కాంబినేషన్లో రోబో సినిమా వచ్చింది. ఈ సినిమా 2010 సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరిగిందని సమాచారం. ఇదిలా ఈ సినిమాలో మొదటగా కమల్ హాసన్ మరియు ప్రీతి జింటాను అనుకున్నారట. ఇందులో భాగంగానే ఫోటోషూట్ అయిన తర్వాత ఈ సినిమా ఆగిపోయిందట.
కొన్ని టెక్నికల్, వివిధ రకాల సమస్యల కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇక 2007లో ఈ ప్రాజెక్టు షారుక్ ఖాన్ మరియు ప్రియాంక చోప్రాల వద్దకు వచ్చిందట. షూటింగ్ కూడా మొదలు పెట్టారట. షూటింగ్ మొదలైన మూడు నెలల్లోనే ప్యాకప్ చెప్పేసారట. ఇలా ఈ నలుగురు స్టార్లు బంపర్ హిట్ సినిమాలు వదులుకున్నారు. చివరగా ఐశ్వర్యరాయ్ మరియు రజనీకాంత్ రోబో సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.