Bandla Ganesh : ఒక్క రోజుకు 5 లక్షలు

టాలీవుడ్ నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్”, తారక్ తో “టెంపర్” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం నిర్మాణపనులకు దూరంగా ఉంటున్నాడు. కొన్ని సినిమాల్లో పాత్రలు చేస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. బండ్ల గణేష్ నటుడితో పాటు బిజినెస్ మెన్ అని కూడా తెలిసిందే. తన బిజినెస్ మైండ్ సెట్ ను ఓ దర్శకుడి వద్ద చూపించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆ దర్శకుడు ఎవరో కాదు.. మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మండవ. అసలు ఏం జరిగిందంటే, రామారావు ఆన్ డ్యూటీలో వేణు తొట్టెంపూడి సీఐ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు శరత్ మండవ అనుకున్నాడట. దీని కోసం బండ్ల గణేష్ ను శరత్ సంప్రదిచారట. దీనికి బండ్ల గణేష్ ఒకే చెప్పాడట. ఎన్ని రోజులు డేట్స్ కావాలని అడిగాడట.

ఒక రోజు సరిపోతుందని డైరెక్టర్ శరత్ మండవ చెప్పాడని టాక్. ఒక రోజుకు బండ్ల గణేష్ ఐదు లక్షలు డిమాండ్ చేశాడని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. బండ్ల గణేష్ ఐదు లక్షలు డిమాండ్ చేయగానే డైరెక్టర్ శరత్ మండవ షాక్ అయ్యాడట. దీంతో వేరే వాళ్లుతో డబ్బింగ్ చెప్పుకుంటామని చెప్పి వెళ్లిపోయారని సమాచారం. అయితే ఒక రోజు డబ్బింగ్ కు బండ్ల గణేష్ 5 లక్షలు డిమాండ్ చేశాడు అన్న వార్త బయటకు రావడంతో బండ్ల గణేష్ బిజినెస్ మ్యాన్ కదా. అలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు