కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ అంటే తెలియని వారు ఉండరు. ఈమె ఇటీవల నటించిన కార్తికేయ2 పాన్ ఇండియా స్థాయి లో పెద్ద హిట్ అయింది. ఈ కేరళ కుట్టి ముందుగా ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన తెలుగు ప్రేమమ్ లో కూడా నటించింది. హీరోయిన్ గా శతమానంభవతి తో పరిచయమైంది. తొలి సినిమాతోనే అనుపమకు మంచి పేరు వచ్చింది. తాజాగా ఈమె చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ2 లో నటించింది. ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
అయితే అనుపమ పరమేశ్వరన్ కెరీర్ స్పీడ్ గత కొద్ది రోజుల నుండి తగ్గింది. కార్తికేయ2 కు ముందు ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కార్తికేయ2 హిట్ అయిన తర్వాత కూడా ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి చేతిలో 18 పేజీస్, బట్టర్ ఫ్లై అనే సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటికి కూడా చాలా రోజుల క్రితమే సైన్ చేసింది. గత ఆరు నెలల నుండి అనుపమకు కొత్తగా ఎలాంటి అవకాశాలు కూడా రావడం లేదు.
ఈ నేపథ్యంలో అనుపమ కెరీర్ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుపమ చూస్తున్నట్టు సమాచారం అందుతుంది. దీనికి కుటుంబం కూడా ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే చాలా రోజుల నుండి అనుపమ కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని అంటున్నారట. ఇప్పుడు అవకాశాలు కూడా పెద్దగా రాకపోవడంతో అనుపమ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. కాగా అనుపమ ప్రస్తుతం 26 ఏళ్లు ఉంది.