Jr NTR : బాలీవుడ్ స్టార్ కపుల్ తో ఎన్టీఆర్ నైట్ పార్టీ… ప్రణతి కూడానా?

Jr NTR : ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ వైడ్ గా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఎన్టీఆర్ తన భార్యతో కలిసి బీ టౌన్ లో మరో సెలబ్రిటీ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటతో కలిసి డిన్నర్ డేట్ కు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ స్టార్ కపుల్స్ అంతా కలిసి ఎక్కడ డిన్నర్ చేశారు? అనే వివరాల్లోకి వెళితే…

ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలతో డిన్నర్…

బాలీవుడ్ లో పార్టి కల్చర్ ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీ టౌన్ లో వార్ 2 మూవీతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎన్టీఆర్. ఆయన ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే అక్కడి కల్చర్ కు అలవాటు పడుతున్నారు. తాజాగా తారక్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి బాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోయిన్లతో ఓ డిన్నర్ పార్టీకి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పార్టీలో ఎవరెవరు ఉన్నారంటే..

ఈ డిన్నర్ పార్టీలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అలియా భట్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్, హృతిక్ రోషన్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వంటి స్టార్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. కాగా వీళ్ళ డిన్నర్ పార్టీ ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ ఖరీదైన పాపులర్ రెస్టారెంట్ లో జరిగింది. అక్కడ వీళ్ళంతా కలిసి పార్టీ చేసుకుంటున్నారు అని తెలిసిన అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి స్టార్స్ తో సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడ్డారు. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఎన్టీఆర్ తన భార్య చుట్టూ చేతులు వేసి ఆమెని కార్ వద్దకు చేర్చారు. అలాగే రణబీర్ కూడా తన భార్య అలియాను జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన అభిమానులతో సెల్ఫీలకు కూడా ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీళ్ళ పార్టీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఒక్కొకరు ఒక్కో సినిమాతో బిజీ..

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే బాలీవుడ్ యాక్షన్  సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుంది. డిన్నర్ పార్టీలో పాలుపంచుకున్న మరో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం మూవీలో నటిస్తున్నారు. ఇందులో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రీసెంట్ గా వీళ్ళకి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యి, సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మొత్తానికి ఎన్టీఆర్ అక్కడ పాగా వేయడానికి ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా కనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు