Vidya Balan : బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఉన్నా, నటనకు ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లు కొంతమందే ఉంటారు. వారు నటన కోసం ఏమైనా చేయగలరు. కంటెంట్ డిమాండ్ చేస్తే ఎటువంటి రిస్క్ అయినా చేస్తారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు విద్యా బాలన్. ఇక ఇటీవల ఈమె చేసిన ఒక స్టేట్మెంట్ నెట్టింట వైరల్ అవుతుంది. ”నేను ధూమపానం ఆనందిస్తాను.. పొగ వాసనను ప్రేమిస్తాను.. రోజుకు 2,3 సిగరెట్లు తాగనిదే నిదురపట్టదు..” ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ టాలెంటెడ్ నటి. ఇక నటిగా కెరీర్ లో ఎన్నో బోల్డ్ పాత్రలతో మెప్పించిన విద్యాబాలన్ ఇటువంటి స్టేట్ మెంట్ చేయడం మామూలే అని అనుకోవచ్చు సినీ ప్రేక్షకులు. కానీ ఆమె వ్యక్తిగతంగా ఆఫ్ లైన్ లో అలాంటి అలవాట్లు ఉన్నా, వాటికి దూరంగానే ఉంటుందని ఆమె సన్నిహితులు చెప్పే మాట. అయితే తాను ధూమపానానికి అడిక్ట్ అయ్యానని బహిరంగంగా అంగీకరించే ది గ్రేట్ పెర్ఫామర్ విద్యాబాలన్ తన స్మోకింగ్ అడిక్షన్ గురించి ఇప్పుడు మరోసారి బహిరంగంగా వ్యాఖ్యానించారు.
స్మోక్ అడిక్షన్ గురించి..
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో విద్యాబాలన్ (Vidya Balan) మాట్లాడుతూ…”కెమెరాలో ఈ విషయం చెప్పాలని నేను అనుకోను.. కానీ నేను స్మోకింగ్ను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు నాకు సిగరెట్ వల్ల ఎటువంటి హాని లేదని చెబితే నేను పొగతాగేదానిని.. నాకు దాని వాసన చాలా ఇష్టం. నా కాలేజీ రోజుల్లో బస్టాపుల్లో కూడా పొగతాగేవాళ్ల పక్కనే కూర్చునేదానిని” అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ నటించిన ‘దో ఔర్ దో ప్యార్’ చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో ఈ సండే కూడా మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిజానికి ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ ప్రధాన పాత్రధారులైన విద్యతో పాటు ప్రతీక్ గాంధీ అద్భుతంగా నటించారు. విడుదలైన ఏడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.3.32 కోట్లు వసూలు చేసింది. చిన్న సినిమా అయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.
ది డర్టీ పిక్చర్ కి ఎక్కువగా..
ఇక దో ఔర్ దో ప్యార్ ప్రమోషన్స్ సందర్భంగా విద్యాబాలన్ తన స్మోకింగ్ అడిక్షన్ గురించి ఓపెన్ అయింది. ప్రముఖ యూట్యూబర్ తో మాట్లాడుతూ, ”ది డర్టీ పిక్చర్ తర్వాత నేను ధూమపానానికి అలవాటు పడ్డాను.. ఈ చిత్రంలో నటించిన అనంతరం రోజుకు 2-3 సిగరెట్లు తాగుతున్నాను. సినిమా షూటింగ్కి ముందు నేను స్మోకింగ్ చేశాను. నాకు స్మోకింగ్ ఎలా చేయాలో తెలుసు.. నేను నిజంగా పొగతాగే సన్నివేశాల్లో నటించాను.. ఒక పాత్రగా దానిని నకిలీ చేయలేం..” అని అన్నారు. ధూమపానం చేసే స్త్రీల గురించి ఒక నిర్దిష్ట అవగాహన ఇప్పుడు చాలా తక్కువగా ఉంది.. అంతకు ముందు చాలా ఎక్కువగా ఉండేదని కూడా బాలన్ వ్యాఖ్యానించారు. ‘ది డర్టీ పిక్చర్’ తర్వాత నేను పొగ తాగడానికి అడిక్ట్ అయ్యాను అంది.. అలాగే బోల్డ్ అవుట్ ఫిట్లు ధరించడం గురించి విద్యా మాట్లాడుతూ.. ”నన్ను భయపెట్టేది ఆ పొట్టి బట్టలు.. ఆ చీలికలను రివీల్ చేసే బట్టలు. ఆ తర్వాత అలా డ్యాన్స్ చేయడం.. నటిగా నన్ను నేను ఊహించుకున్నప్పుడు.. నేను ఎప్పుడూ ఏమీ చేయను. కానీ నాలో ఆ విషయం నాతో పాటు అందరికీ నచ్చింది.. ఇది నాకు కావాల్సిన అవకాశం.. కానీ ప్రజలు దీనిని కెమెరాలో చూస్తున్నారని నేను గ్రహించాను..” అని విద్యా బాలన్ అన్నారు. ఇక విద్యా బాలన్ ఆ మధ్య తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు లో నటించిన విషయం తెలిసిందే.