Jr ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా సక్సెస్ లో మునిగి తేలుతున్నారు. ప్రపంచమంతటా ఎన్టీఆర్ నటనకి గాను ప్రశంశలు వెల్లువెత్తున్నాయి. “కొమురం భీముడో” పాట ఎన్టీఆర్ కు నటన పరంగా మంచి పేరును తెచ్చి పెట్టింది. నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కి గాను ఆస్కార్ కూడా ఎంపిక అవడం తెలుగు ఇండస్ట్రీకి మరింత ప్రముఖత్యను తీసుకొచ్చింది.
RRR సక్సెస్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ చిత్రం తర్వాత ఈ హీరో కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ పొడక్షన్ పనులు ఇప్పటికే జరుపుకుంది. తీసిన అని సినిమాలు హిట్ కావడంతో, కొరటాల శివ నుంచి భారీ హిట్ ను ఆశిస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో సుధాకర్ మిక్కిలినేని తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగా అప్డేట్స్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లబోతుందట. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఓ చిన్న షెడ్యూలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు వెల్లడవుతుంది.
ఒక వేల షూటింగ్ ప్రారంభం కానీ తరుణంలో మార్చి నుంచి షెడ్యూలు ప్రారంభం అయే అవకాశాలు ఉన్నాయని టాక్. ప్రస్తుతం శంషాబాద్ దగ్గరలో ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతుది. మొదటి షెడ్యూల్ ను ఇక్కడ పూర్తి చేసుకుని, గోవాలో మరో షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. గోవాలో పూర్తి కాగానే మళ్లీ హైదరాబాద్ కి వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అలంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉండగా, తారక రత్న ఆరోగ్యం కూడా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంపై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.