Hanuman : సందడి ఇంకా తగ్గలేదు..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన “హనుమాన్” సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. మామూలుగా హనుమాన్ సినిమాకు పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా డబుల్ ప్రాఫిట్ వరకు మహా అయితే అంత కంటే కాస్త ఎక్కువగా రాబట్టుకుని సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతకుమించి భారీ కలెక్షన్లతో హనుమాన్ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా లాభాలను అందించి బెస్ట్బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక టాలీవుడ్ లో వంద కోట్ల లాభాల్ని ఆర్జించిన బాహుబలి2 RRR సినిమాల సరసన నిలిచింది హనుమాన్ సినిమా.

డివోషనల్ సెంటిమెంట్ ప్లస్ పాయింట్..

అయితే హనుమాన్ సినిమాలో హనుమంతుడి కాన్సెప్ట్ ఉండడం వల్ల హిందూ భక్తులకు సినిమా ఊహించిన దానికంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. అలాగే విడుదల టైమ్ లోనే లోనే రామ మందిరం ప్రతిష్టాపన జరగడం ఈ సినిమాకు మరింత హెల్ప్ అయింది. అందువల్ల లాంగ్ రన్ లో ఈ సినిమాకి భారీ వసూళ్లు సాధించడానికి స్కోప్ దొరికింది. పైగా ఈ సినిమాకు మేకర్స్ కూడా కలెక్షన్స్ లో కొంత డబ్బును రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం కూడా అందరినీ ఆకర్షించింది. ముందుగా మహా అయితే 20 లేదా 30 లక్షల వరకు విరాళం ఇస్తారేమో అనుకుంటే, సినిమా నుండి వచ్చిన వసూళ్ళలో దాదాపు 3 కోట్లకు పైగానే విరాళంగా ప్రకటించారు.

- Advertisement -

సెంట్రల్ హోమ్ మినిష్టర్ ని కలిసిన హనుమాన్ మేకర్స్..

హనుమాన్ మూవీ టీమ్ ప్రమోషన్స్ అలాగే తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులను కూడా బాగా ఆకర్షించాయి. ఇక తాజాగా ప్రస్తుత భారత ప్రభుత్వ హోమ్ మంత్రి, అలాగే బిజెపి టాప్ లీడర్ల లో ఒకరైన అమిత్ షా ప్రత్యేకంగా హనుమాన్ యూనిట్ ను కలుసుకున్నారు. తెలంగాణలో జరిగిన పలు మీటింగ్స్ కు హాజరైన అమిత్ షా అనంతరం హనుమాన్ చిత్ర యూనిట్ సభ్యులను కలుసుకున్నారు. అయితే ఈ మీటింగ్ ను తెలంగాణ బిజెపి లీడర్ కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే హీరో తేజా సజ్జా ప్రత్యేకంగా అమిత్ షా తో మాట్లాడడం కూడా జరిగింది. ఇక చిత్ర యూనిట్ ప్రత్యేకంగా హనుమాన్ ఐడాల్ ను కూడా కానుకగా అమిత్ షాకు ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

జై హనుమాన్ త్వరలో..

ఇక హనుమాన్ మూవీ యూనిట్ ని గతంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణకు వచ్చిన అమిత్ షా వారిని కలుసుకొని ప్రత్యేకంగా అభినందించారు. ఇక హనుమాన్ మూవీ కి సీక్వెల్ గా జై హనుమాన్ ని ప్రకటించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం వేరే సినిమాను మొదలుపెట్టాడు. అది పూర్తవగానే జై హనుమాన్ మూవీ మొదలుపెట్టేస్తాడని సమాచారం.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు